టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ దర్శకులలో తనకంటూ సపరేట్ మార్కెట్ ఏర్పరుచుకున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శీను. సినిమా ఇండస్ట్రీలోకి భద్ర సినిమాతో అడుగుపెట్టి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న డైరెక్టర్ బోయపాటి ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి విజయాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తన పేరిట నమోదు చేసుకున్నాడు. బోయపాటి డైరెక్షన్లో వచ్చిన భద్ర, తులసి, సింహ, లెజెండ్ మరియు సరైనోడు లాంటి సినిమాలు బోయపాటికి మంచి పేరును తీసుకువచ్చాయి. అయితే ఈ క్రమంలో ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో చేసిన 'వినయ విధేయ రామ' సినిమా దారుణంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో బోయపాటి దర్శకత్వం పై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి.


ఈ సంవత్సరం మొదటి లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమాపెట్టిన రిజల్ట్ కి బోయపాటి తో మరొక హీరో చేయడానికి చాలా ఆలోచించే విధంగా పరిస్థితులు దారితీశాయి అని ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. అయితే బాలయ్య బాబుతో మూడో సినిమా చేయడానికి బోయపాటి రెడీ అయ్యారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో తాజాగా మొదలు కాబోతున్న మూడో సినిమాపై నందమూరి అభిమానులలో చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో గ్యారెంటీగా వీరిద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అని మరియు అదే విధంగా బోయపాటి మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వెళ్లడం ఖాయమని నందమూరి బాలయ్య బాబు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


ఇదిలా ఉండగా బాలయ్య బాబుతో ప్రస్తుతం చేస్తున్న సినిమా కోసం బోయపాటి దాదాపు సగం రెమ్యూనరేషన్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'వినయ విధేయ రామ' వరకు బోయపాటి 15 కోట్ల వరకు పారితోషికం అందుకునేవారట. కాగా త్వరలో రూపొందించబోయే బాలయ్య మూవీకి బోయపాటి రెమ్యునరేషన్ 8 కోట్లు మాత్రమే బోయపాటి తీసుకుంటున్నారట. దీనంతటికి కారణం 'వినయ విధేయ రామ' సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ అని కామెంట్ చేస్తున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: