టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు
సినిమా ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం చివరిదశ షూటింగ్ ని జరుపుకుంటోంది.
మహేష్ సరసన బ్యూటిఫుల్
హీరోయిన్ రష్మిక మందన్న తొలిసారి నటిస్తున్న ఈ సినిమాపై
సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు
టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి.
మహేష్ మరియు
రష్మిక మధ్య వచ్చే
రొమాంటిక్ మరియు
కామెడీ సీన్స్ ఈ సినిమాలో ఎంతో అదిరిపోతాయని, అలానే సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్యాన్స్ కు కావలసిన అన్ని రకాల మాస్ మరియు కమర్షియల్ అంశాలు ఉండనున్నట్లు టాక్.
ఇక కొన్ని సీన్స్ లో ట్రెడిషినల్ డ్రెస్ లంగావోణీలో ఎంతో అందంగా మెరిసిన ఈ ముద్దుగుమ్మ, తన ఆకట్టుకునే అందంతో
మహేష్ ని డామినేట్ చేసే ప్రయత్నం మాత్రం బాగానే చేసిందని అంటున్నారు. వాస్తవానికి ఎంతో అందగత్తె అయిన రష్మికకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. మరి స్క్రీన్ పై
మహేష్ ని ఎంతవరకు ఈ
భామ తన అందంతో డామినేట్ చేసిందో తెలియాలంటే మాత్రం 2020
జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే....!!