టాలీవుడ్ బాహుబలి ప్రభాస్, ప్రస్తుతం
జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో
జాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ
సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. తొలిసారి
పూజా హెగ్డే ప్రభాస్ సరసన
హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు అత్యంత భారీగా నిర్మిస్తున్నాయి. 1960ల సమయంలో
యూరోప్ దేశంలో జరిగిన హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో
ప్రభాస్ క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా ఉండడంతో పాటు, ఆయన ఫ్యాన్స్ కు ఎంతో నచ్చుతుందని
టాలీవుడ్ వర్గాల టాక్.
ఇకపోతే ఇటీవల రిలీజ్ అయిన
సాహో తరువాత ఈ
సినిమా విషయమై ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న
ప్రభాస్, ఎలాగైనా దీనితో మంచి హిట్ కొట్టి తన ఫ్యాన్స్ ని
ఖుషి చేయాలని చూస్తున్నారట. ఇకపోతే
బాలీవుడ్ సినిమాల విషయమై
ప్రభాస్ నేడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం
నగర్ వర్గాల్లో వార్తలు హల్ చేస్తున్నాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే,
బాహుబలి రెండు భాగాలు మరియు
సాహో సినిమాలను
బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసి మంచి కలెక్షన్స్ తో పాటు క్రేజ్ కూడా సొంతం చేసుకున్న
ప్రభాస్, ఇకపై తన సినిమాలు తప్పనిసరిగా హిందీలోనూ రిలీజ్ అవుతాయని నిర్ణయించడం జరిగిందట.
అలానే
తమిళ్ మరియు మలయాళం,
కన్నడ భాషల్లో కూడా ఇకపై తన రిలీజ్ లు ఉండేలా
ప్రభాస్ ఇప్పటికే గట్టిగా
ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఎందుకంటే
బాహుబలి సినిమాల తరువాత దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ తనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడడంతో, ఏ ఒక్కచోటా కూడా అభిమానులు నిరశ చెందకూడదని భావించి
ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ .ఇక ఇటీవల అయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇకపై తాను చేయబోయే సినిమాలు చాలావరకు భారీ బడ్జెట్ వే ఉంటాయని, ఎందుకంటే
బాహుబలి తరువాత ఫ్యాన్స్ తనను అటువంటి సినిమాల్లోనే చూడాలని కోరుకుంటున్నట్లు
ప్రభాస్ తెలిపారు.....!!