జులాయి,
సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల తరువాత బన్నీ,
త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం ''అల వైకుంఠపురంలో''. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ మధ్య భారీ అంచనాలున్నాయి. బన్నీ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్లో
అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీకి జోడీగా
పూజా హెగ్డే నటిస్తోంది. నివేతా పేతురాజ్ మరో హీరోయిన్.
టబు, జయరాం, సుశాంత్,
మురళీ శర్మ, హర్షవర్థన్, నవదీప్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ
సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే విడుదలైంది. అలాగే సామజవరగమన అనే పాటను కూడా
సినిమా యూనిట్ విడుదల చేసింది. గీతాఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి
2020 సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఇకపోతే “అంగు వైకుంఠపురత్తు” అనే టైటిల్తో మలయాళ వర్షెన్ విడుదల కానుండగా, చిత్రం నుండి సామజవరగమన అనే పాటను నవంబర్ 10న విడుదల చేశారు. ఇక ఈ పాటతో మలయాళంలో కూడా
సినిమా పై హైప్ పెరిగిందనే చెప్పాలి. అక్కడ కూడా ఈ సినిమాని అదే రోజున విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అల్లుఅర్జున్కు అక్కడ ఉన్న క్రేజ్తో మలయాళ రైట్స్ కూడా భారీ స్థాయిలో అమ్ముడుపోతాయని డిస్ట్రిబ్యూటర్లు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలోనే అక్కడ కూడా
బిజినెస్ ఎంక్వైరీలు ప్రారంభమయ్యాయి. అక్కడ
మీడియా సైతం ఈ విషయమై కథనాలు వెలువరిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ
సినిమా గురించిన వార్తలు వస్తున్నాయి. దాంతో అక్కడ క్రేజ్ మామూలుగా లేదు. దీంతో బన్నీ అక్కడ కూడా షేక్ చేసేందుకు భారీ ప్లానే వేస్తున్నారని చెప్పాలి.
ఇక ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులుగా డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్:
రామ్ లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్
ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్, నిర్మాతలు:
అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు).