టాలీవుడ్ లో
సక్సెస్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తన డ్యాన్స్, ఫైట్స్,
కామెడీ తో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇక
త్రివిక్రమ్ -
అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే హిట్ మాటే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి
సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందు.
ఇక నాపేరు సూర్య ఫ్లాప్ తర్వాత
అల్లు అర్జున్ చాలా సమయం తీసుకున్నారు. మద్యలో పలువురు దర్శకులు ఆయనకు కథలు వినిపించినా..పెద్దగా నచ్చకపోవడంతో సున్నితంగా తీరస్కరించారట. మొత్తానికి
త్రివిక్రమ్ తీసుకు వచ్చిన కథ బాగుండటంతో ఆయనతో మూవీకి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో
బన్ని సరసన
బాలీవుడ్ సెక్సీ
బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘అలా వైకుంఠపురములో’ తన పాత్ర గురించి రివీల్ చేసింది.
ఈ మూవీలో బన్నీకి బాస్ గా కనిపించబోతున్నట్లు..చాలా పొగరుబోతు క్యారెక్టర్..ఈ మూవీలో బన్నీతో భలే ఆడుకుంటుందట. బాస్ గా పెట్టె టార్చర్ బన్నీకి పిచ్చెక్కిపోతాడని చెబుతుంది. అయితే అంత పొగరు బోతు క్యారెక్టర్ ని ఎలా
లవ్ లో పడేసింది అనేది తెరపై చూడాల్సిందే అంటుంది ఈ బ్యూటీ. నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయని
పూజా హెగ్డే తెలిపింది.
ఈ
మూవీ త్రివిక్రమ్ మార్క్ లోనే ఉంటూ రొమాన్స్, డ్రామా, ఎమోషన్ ఇలా అన్ని అంశాల్లో మెప్పించే విధంగా ఉంటుందని
పూజా హెగ్డే తెలిపింది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ,
అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి
అల వైకుంఠపురములో మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే
తమన్ అందించిన రెండు పాటలు
యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి.