ఈసారి రాబోయే సంక్రాంతి సందర్భంగా తెలుగు సినిమాల సందడి బాగా ఎక్కువగా ఉండనుంది. ఒకరకంగా మన ప్రేక్షకులకు ఇది కన్నులపండుగే అని చెప్పకతప్పదు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమాలు రెండు కూడా ఈ సంక్రాంతి బరిలో నిలవడంతో పాటు, ఇవి రెండూ ఒకేరో జున రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు మరియు ఆయ హీరోల అభిమానుల మధ్య మరింత ఆసక్తి నెలకొని ఉంది. ఇక వీటితో పాటు వెంకటేష్, నాగచైతన్యల వెంకీ మామ, నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా, అలానే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సినిమాలు కూడా ఈ సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. 

అయితే మహేష్, బన్నీల సినిమాలు మాత్రం ఒకేరోజున థియేటర్స్ లోకి వస్తుండడంతో వాటిని కొన్న బయ్యర్ల మనసులో మాత్రం లోలోపల కొంత ఆందోళన నెలకొని ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే, ఈ ఇద్దరూ కూడా బడా స్టార్స్ కావడంతో ఇద్దరి సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే, రెండు సినిమాల్లో ఏ ఒక్కదానికి కూడా చెప్పకోదగ్గ ఓపెనింగ్ కలెక్షన్ వచ్చే అవకాశం ఉండదని, ఎందుకంటే రెండు సినిమాలకు కూడా సమాన థియేటర్స్ కేటయించడంతో కెలెక్షన్స్ ఇద్దరి హీరోల సినిమాలు కూడా పంచుకోవలసి వస్తుందని అంటున్నారు. అదే కనుక ఈ రెండిటిలో ఏదో ఒక సినిమా, ఒకరోజు ముందుగాని, లేదా తరువాత కానీ రిలీజ్ అయితే, 

రెండిటికి ఫస్ట్ డే ఓపెనింగ్స్ తప్పకుండా అదిరిపోతాయని వారు అభిప్రాయపడుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ ఇద్దరు హీరోలతో పాటు వాటి ప్రొడ్యూసర్స్ కూడా ఒక్క అడుగు వెనుకకు వేసేది లేదని, అనుకున్న ప్రకారమే తమ తమ సినిమాలు థియేటర్స్ లోకి వస్తాయని భీష్మించుకు కూర్చున్నారట. అయితే దీనిపై కొందరు సినిమా విశ్లేషకులు స్పందిస్తూ, ఈ రెండు సినిమాల విడుదలకు మరొక రెండు నెలల సమయం ఉంది కాబట్టి, అవకాశం ఉన్నంతవరకు రెండు సినిమాల నిర్మాతలు కనుక ఒకసారి కూర్చుని చర్చించి, రెండిటికి కనీసం ఒక్కరోజైనా గ్యాప్ ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు. మరి ఈ రెండు సినిమాల విషయమై రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: