వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే, హీరో, హీరోయిన్ గా అల్లరి నరేష్ కీలక పాత్రలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు,సి అశ్వనీదత్ ,పీవీపీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మహార్షి. 2019 మే నెల 9న విడుదలైన ఈ మూవీ సూమారుగా నూట ముపై కోట్లతో నిర్మితమై బాక్స్ ఆఫీసు దగ్గర రూ.170 కోట్లను కొల్లగొట్టింది..
ఇకపోతే అలెగ్జాండర్ లాంటి వాళ్లు ప్రపంచాన్ని ఏలాలని యుద్ధాలు చేశారు. కానీ ఇప్పుడు యుద్దాలు చేయాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ప్రపంచాన్ని గూగుల్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివి ఏలుతున్నాయి. ఇలాంటి సాప్ట్వేర్ ఏదైనా ఒక్కటి కనిపెడితే చాలు సార్.. ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చూ అంటూ సక్సెస్కి కొత్త అర్థం చెప్పిన ‘మహర్షి’ కథ యూత్కు ఎంతగానో నచ్చింది. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది.
ఈ చిత్రంలో రిషి అనే స్టూడెంట్గా, పెద్ద ఐటీ కంపెనీ ఓనర్గా మహేష్ బాబు నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అంతే కాకుండా అల్లరి నరేష్ పాత్ర ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారు దర్శకుడు. ఇకపోతే ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ పాస్ చేసాడు దర్శకుడు. అలాగే ఈ కాలంలోని యువత కూడ ఎలా ఉండాలో చెప్పిన విధానం చాలా బాగుంది. ఇక అసలు విషయం ఏంటంటే ఈ సినిమా తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.
అదేమంటే ఈ సినిమా 2019లో ట్విట్టర్లో టాప్ 5 ట్రెండింగ్ ట్యాగ్లో టాప్ 4 ప్లేస్లో నిలిచింది. దక్కించుకుంది. ఇందులో టాప్ 1లో అజిత్ హీరోగా నటించిన ‘విశ్వాసం’ నిలవగా. సెకండ్ ప్లేస్లో లోక్సభ ఎన్నికలు, మూడో ప్లేస్లో వరల్డ్ కప్ 2019, నాల్గో ప్లేస్లో మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి స్థానం దక్కించుకుంది. ఇకపోతే ఐదో ప్లేస్లో దీపావళి ట్యాగ్ నిలవడటం విశేషం. ఈ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్కు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కృతజ్ఞతలు తెలిపింది..