త్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించి కిక్ ఇచ్చే న్యూస్ వినిపిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో మెగానందమూరి ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు టాక్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లను మహా వీరులుగా చూపిస్తున్న జక్కన్న మెగా, నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే ప్లాన్ వేసినట్టు సమాచారం. 


రాజమౌళి సినిమా అంటేనే గ్రాండియర్. సినిమాలో ఇది లేదు అనేద విధంగా జక్కన్న అన్ని సమపాళ్లలో రంగరిస్తాడు. అందుకే రాజమౌళి ఎప్పుడో టాలీవుడ్ రేంజ్ దాటేసిపోయాడు. ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న త్రిపుల్ ఆర్ షూటింగ్ జోరుగా సాగుతోంది. మెగా నందమూరి వారసులతో తెలుగు చరిత్ర కనివినీ ఎరుగని స్థాయిలో ఈ సినిమాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ నే సినిమా హైలెట్ అనుకుంటే ఇప్పుడు సినిమాలో ఇంతకు మించిన సర్ ప్రైజ్ లు ఉండబోతున్నట్టు టాక్. 


రియల్ క్యారెక్టర్స్ ఇన్స్ ప్రైన్షన్ తో సాగే ఫిక్షన్ డ్రామా అని రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాపై ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. అంటే ఊహాజనిత కల్పిత పాత్రలతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోందని అర్థం. ఈ సినిమాలో కమర్షియల్ సినిమా తరహాలో రెగ్యులర్ పాటలు ఉండవని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా థీమ్ కు తగ్గట్టు మాత్రం పాటలు ఉంటాయట. అయినప్పటికీ ఫ్యాన్స్ తో ఆడియన్స్ కు కిక్కిచ్చే రేంజ్ లో రాజమౌళి సాంగ్స్ ని డిజైన్ చేయనున్నట్టు సమాచారం. 


త్రిపుల్ ఆర్ కు సంబంధించిన న్యూ అప్ డేట్స్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. రాజమౌళి.. చరణ్, ఎన్టీఆర్ పై గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో పాటను ప్లాన్ చేస్తున్నాడట. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ బ్రిలియంట్ డ్యాన్సర్స్ కాబట్టి రాజమౌళి ఇద్దరిపై సూపర్ డ్యాన్సులు ఉండేలా ఓ పాటను ప్లాన్ చేస్తారని వినిపిస్తోంది. ఈ పాట కోసం ప్రత్యేకంగా ఒక సెట్ కూడా నిర్మించారట. త్వరలోనే పాట షూట్ చేయనున్నట్టు వినికిడి. బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో త్రిపుల్ ఆర్ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: