ప్రేక్షకులకు మూడుగంటల వినోదాన్ని సినిమా పంచుతుంది. కాని ఆ వినోదం అందించడానికి ఎంత మంది కృషిచేస్తారో, ఎన్ని కష్టాలు పడతారో తెలియనిది కాదు. షూటింగ్ సమయాల్లో ఒక్కోసారి ప్రాణాలు కూడ పోవచ్చూ, వికలాంగులు కూడా కావచ్చూ. ఇలా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటిదే జరిగిన ఘటనలో బాలీవుడ్ హీరోయిన్ ఒకరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్లితే..
భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా అమోల్ గుప్తా దర్శకత్వంలో పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సైనా’. కాగా ఈ సినిమా షూటింగ్లో భాగంగా పరిణీతి గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ డ్యూడ్స్... ‘సైనా’ షూటింగ్ సమయంలో నాకు చిన్న గాయం కూడా కాకుండా నేను, చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ అది జరిగిపోయింది.
కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ బ్యాడ్మింటన్ ఆడేందుకు సిద్ధమైపోతాను అని పరిణీతి మెడకు బ్యాండేజ్తో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఇకపోతే ఇష్క్జాదే సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన పరిణీతి.. శుద్ధ్ దేశీ రొమాన్స్, దావత్-ఏ-ఇష్క్, నమస్తే ఇంగ్లండ్ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఆమె నటించిన కేసరి, జబరియా జోడి సినిమాలు ఈ ఏడాది విడుదల కాగా.. ప్రస్తుతం సైనా షూటింగ్తో ఆమె బిజీగా ఉన్నారు.
ఇక తొలుత శ్రద్ధా కపూర్ను ఈ సినిమాలో సైనా పాత్రకు తీసుకోగా, కాల్షీటు ఇతర సినిమాల కారణంగా సర్దుబాటు చేయలేకపోవడంతో ఈ అవకాశం పరిణీతి వరించింది. ఇకపోతే పరిణీతి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రో కజిన్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో పరిణీతి త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.