యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమలో రాం చరణ్ కూడా మరో హీరోగా చేస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో చరణ్, తారక్ ఇద్దరు తమ నట విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది. బాహుబలి సినిమాను బీట్ చేసేలా ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కిస్తున్నాడత రాజమౌళి.


ఇక ఈ సినిమాను 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. అంటే ఫిబ్రవరి మార్చి కల్లా షూటింగ్ పూర్తి చేసి అప్పటి నుండి పోస్ట్ ప్రొడక్షన్ పెట్టుకోనున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్ ఇప్పటికే ఓ సినిమా లైన్ లో పెట్టాడు. అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.


తెలుస్తున్న సమాచారం ప్రకారం తారక్ మరోసారి త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అరవింద సమేత సినిమాతో మొదటిసారి కలిసి పనిచేసిన ఎన్.టి.ఆర్ మరోసారి త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కథ ఆల్రెడీ తారక్ తో డిస్కస్ చేశాడట త్రివిక్రం. ప్రస్తుతం బన్నితో చేస్తున్న అల వైకుంఠపురములో సినిమా పూర్తి చేసి తారక్ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేస్తాడట త్రివిక్రం.


ఎన్.టి.ఆర్ కూడా ఆర్.ఆర్.ఆర్ పూర్తి అవడమే ఆల్స్యం త్రివిక్రం సినిమా ఎనౌన్స్ చేసి వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. ఈ సినిమా కథ కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అంటున్నారు. తారక్, త్రివిక్రం కాంబో అనగానే నందమూరి ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. మరి ఈసారి ఈ కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాతో పాటుగా ఎన్.టి.ఆర్ తో తమిళ దర్శకుడు అట్లీ కూడా ఓ సినిమా చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. మరి ఆ కాంబినేషన్ సినిమా కూడా సేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: