విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ స్టార్టింగ్ లో వరుసగా విజయాలు అందుకున్నారు. శృతిహాసన్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లతో రికార్డుల మీద రికార్డులు సృష్టించడంతో శృతిహాసన్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ చేసిన క్యారెక్టర్ కి మరియు పవన్ కళ్యాణ్ కొట్టిన సూపర్ డూపర్ హిట్ కి శృతి హాసన్ కి వరుస ఆఫర్లు స్టార్ హీరోల పక్కన నటించడానికి దక్కాయి.


అయితే ఆ తర్వాత 2017 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా లో పవన్ పక్కన శృతిహాసన్ నటించాక ఆ తరువాత ఎప్పుడూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమా చేయలేదు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి శృతిహాసన్ అడుగు పెట్టబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. విషయంలోకి వెళితే మాస్ మహారాజ రవితేజ  'క్రాక్' చిత్రంలో శృతి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.


టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుండడంపై, బలుపు తర్వాత రవితేజతో రొమాన్స్ చేయనుండడంపై శృతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. బలుపు సెట్స్ లో నేను రవితేజ కలసి చేసిన రచ్చ నాకు ఇప్పటికి గుర్తే. క్రాక్ మూవీ కోసం కూడా అంతే ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. టాలీవుడ్ లో నటించడం అంటే నాకు ఎప్పుడూ సంతోషమే. టాలీవుడ్ నాకు రెండవ ఇల్లు లాంటిది అని శృతి హాసన్ తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం శృతి హాసన్ తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా తన లండన్ ప్రియుడితో బ్రేకప్ అయిన తర్వాత సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది శృతిహాసన్. 

 

 



మరింత సమాచారం తెలుసుకోండి: