బుల్లితెర యాంకర్ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన నిహారిక కొణిదెల... తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకోవాలనుకుంది. ఈ ఉద్దేశంతోనే బుల్లి తెరను వదిలి వెండితెరపై తెలుగు ప్రేక్షక అభిమానులను అలరించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే మొట్టమొదటిగా... 2016వ సంవత్సరంలో 'ఒక మనసు' అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆమె ఆశలన్నీ నిరాశ అయ్యాయి.

ఒకటి పోతే ఏంటి ఇంకో సినిమా చేసి మంచి హిట్ కొడదాం అనే ఉద్దేశంతో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాని నిహారిక ఎంచుకొని దాంట్లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా పరమ బోరింగ్ గా ఉండటం వలన అది కూడా ఒక డిజాస్టర్ గా మిగిలింది. అప్పటికే సగం ఆశలను వదిలేసుకున్న నిహారిక.. తన అదృష్టాన్ని చివరగా మరోసారి పరీక్షించుకుందామని సూర్యకాంతం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. 


అది కూడా తన ఖాతాలో మరొక డిజాస్టర్ కావడంతో నిహారికకు సినిమాలపై విరక్తి వచ్చేసింది. ఆమె 2018లో టైటిల్ రోల్లో నటించిన తమిళ సినిమా ఒరు నల్లనాళ్ పాత్తు సొల్ఱేన్ కూడా విజయం సాధించలేకపోయింది. దీంతో మెగా బ్రదర్ నాగబాబు "ఈ సినిమాలు నీకు ఏమీ అచ్చు రావట్లేదమ్మా మంచి పెళ్లి సంబంధం చూస్తా.. పెళ్లి చేసుకో" అన్నాడని సమాచారం. 


అయితే నిహారిక కొణిదెల "డాడీ, నేను సినిమాల జోలికి వెళ్లను కానీ ఫస్ట్ లో నేను చేసిన ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు కూడా ఆ వెబ్ సిరీస్ లే చేస్తా" అన్నదని సమాచారం. దీనికి మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు లు కూడా అంగీకరించారట. ప్రస్తుతం మ్యాడ్ హౌజ్ అనే వెబ్ సిరీస్ నిర్మిస్తుంది నిహారిక. ఒకటి రెండు కాదు ఏకంగా 100 ఎపిసోడ్స్ ఉండేలా ఈ సిరీస్ ఉండబోతుంది. ఇందులో నిహారిక నటిస్తుంది కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: