టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు వరకు ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి. ఇక రాజమౌళి సినిమాలు హీరో రేంజ్ ను ఎక్కడకొ తీసుకెళ్తాయి. ఒక ఈగ ను పెట్టి సినిమా తీసి కూడా విజయం సాధించారు రాజమౌళి. అందుకే దర్శకుడు రాజమౌళిని జక్కన్న అని పిలుస్తుంటారు. ఇక బాహుబలి సినిమా సెన్సేషనల్ హిట్ తో జక్కన్న క్రేజ్ ప్రపంచం నలుమూలలా పాకిపోయింది. ఇప్పుడు జక్కన్న సినిమా వస్తుందంటే ఒక్క టాలీవుడ్ ప్రేక్షకులు కాదు ప్రపంచవ్యాప్తంగా జక్కన్న అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే బాహుబలి2 సెన్సేషనల్ హిట్ తర్వాత జక్కన్న ఎలాంటి కథను పట్టాలెక్కించబోతున్నారని దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా ఓ కొత్త కథతో దర్శక ధీరుడు రాజమౌళి పట్టాలెక్కించిన పోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్రహీరోలు అయినా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఆర్.ఆర్ ఆర్. భారీ బడ్జెట్తో ఆసక్తికర కథాంశంతో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ కలవని స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనే దానిపై ఈ సినిమా తెరకెక్కుతుంది . ఓ వైపు రాజమౌళి సినిమా మరోవైపు అగ్ర హీరోల సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సినిమా నుంచి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది వైరల్ గా మారుతుంది. ఇక ఈ సినిమా కోసం ఓ వైపు దర్శకుడు జక్కన్న అభిమానులు... మరోవైపు మెగా అభిమానులు... ఇంకోవైపు నందమూరి అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ను పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు అన్నది మాత్రం ఆసక్తిగా మారింది. అయితే తాజాగా చిత్ర బృందం నుంచి ఓ ఆసక్తికర ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఏ హీరోయిన్ నటించబోతున్నారు అనేది రేపు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జక్కన్న తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఢీ కొట్టె విలన్లు ఎవరన్నది కూడా రేపే వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉన్న ఈ అంశానికి రేపు తెరపడనుంది .