టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతి త్వరలో సినిమాల్లోకి మళ్ళీ రిఎంట్రీ ఇస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ లో ఆనందం వెల్లివిరిసింది. ఇటీవల అమితాబ్ బచ్చన్ హీరోగా బాలీవుడ్ లో రిలీజ్ అయిన పింక్ అనే మూవీ అధికారిక రీమేక్ లో పవన్ నటించబోతున్న విషయం తెలిసిందే. బోనీ కపూర్, మరియు దిల్ రాజు నిర్మాతలుగా యువ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా అధికారికంగా అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం సెట్ వర్క్ తో పాటు నటీనటుల ఎంపిక కూడా ప్రారంభమైనట్లు సమాచారం. 

 

పవన్ పవర్ఫుల్ లాయర్ గా నటించబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఇకపోతే ఈ సినిమా తరువాత పవన్ జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం క్రిష్ మంచి అద్భుతమైన కథను సిద్దం చేసారని, పవన్ ఇమేజికి సరిగ్గా సరిపోతూ, సమాజానికి మంచి ఇచ్చేలా ఈ  సినిమా ఉండనున్నట్లు చెప్తున్నారు. అంతేకాక ఈ  సినిమాలో పవన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు టాక్. కథ రీత్యా సినిమాలో ఇద్దరి హీరోయిన్లు తప్పనిసరి అని భావించిన క్రిష్

 

ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ వేటలో ఉన్నట్లు సమాచారం. కాగా టాలీవుడ్ లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా పింక్ సినిమా రీమేక్ లో నటించే పవన్ కళ్యాణ్, తదుపరి చేయబోయే ఈ సినిమా విషయమై కొంత గోప్యత వహించమని దర్శకుడు క్రిష్ కు చెప్పారని, అయితే ఆయన సన్నిహితులు కొందరి ద్వారా ఈ వార్త బయటకు వచ్చిందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, పవన్ ఫ్యాన్స్ కు ఇది మంచి పండుగ వార్తే అని చెప్పకతప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: