అక్కినేని యువ హీరో అఖిల్ చేసిన మూడు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందుకోలేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను మూడు సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. అయితే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు అఖిల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు.    

 

సినిమా కథ భాస్కర్ రాం చరణ్ తో తీసిన ఆరెంజ్ కథకు దగ్గరగా ఉంటుందని తెలుస్తుంది. నిజమైన ప్రేమ కోసం అఖిల్ ఈ సినిమాలో ఎక్కడ నుండి ఎక్కడికో వెళ్తాడట. ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో వరుస స్టార్ ఛాన్సులు అందుతున్నాయి. 

 

అఖిల్ పూజా హెగ్దెల జోడీ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తుంది. సినిమాలో అఖిల్ నిజమైన ప్రేమ కోసం తపించే యువకుడిగా కనిపిస్తాడట. అయితే ఆ ప్రేమని పలుకరించి వెళ్లిన హీరోయిన్ పూజా హెగ్దె కోసం చాలా దూరం ప్రయాణిస్తాడట. అయితే నిజమైన ప్రేమ అంటూ ఆరెంజ్ తో ఆల్రెడీ ఓ ప్రయోగం చేసి ఫెయిల్ అయ్యాడు బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు, పరుగు సినిమాల తర్వాత భాస్కర్ చేసిన ఆ సినిమా కాన్సెప్ట్ బాగున్నా వర్క్ అవుట్ అవలేదు.

 

అయితే అఖిల్ సినిమా కూడా దగ్గర దగ్గరగా అదే కాన్సెప్ట్ తో వస్తుందని తెలుస్తుంది. అయితే లైన్ దగ్గరగా ఉన్నా స్క్రీన్ ప్లే ఈసారి డిఫరెంట్ గా ఉంటుందట. తప్పకుండా ఈ సినిమా అఖిల్ కు తప్పకుండా హిట్ ఇస్తుందని అంటున్నారు. అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ ఈ కాంబినేషన్ పై అక్కినేని ఫ్యాన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి అఖిల్  ఈ సినిమాతో అయినా హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: