సాధారణంగా బుల్లితెరపై టామ్ అండ్ జెర్రీ చూసే ఉంటారు.  ఎప్పుడూ కొట్టుకోవడం..ఒకదాని మించి మరొకటి ఎత్తులు వేసుకోవడం..ఎంతో ఫన్నీగా అనిపిస్తుంది.  కొంత మంది వ్యక్తుల మద్య వైరాలు కూడా ఇలాగే అనిపిస్తుంటాయి.  కొంత కాలంగా సినీ నటి శ్రీరెడ్డి వర్సెస్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ కి మద్య రగడ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని దానిపై పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చింది శ్రీరెడ్డి. ఆ సమయంలో టాలీవుడ్ లో ఎంతో మంది అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ కి బలైపోతున్నారని..వారిని ఆదుకోవాలని పవన్ లాంటి క్రేజీ హీరో ముందుకు రావాలని అడిగితే అతను స్పందించలేదని కోపంతో..పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.  దాంతో ఆమె చేస్తున్న కాస్టింగ్ కౌచ్ పోరాట ఉద్యమం కాస్త నీరుగారిపోయింది. 

 

పవన్ ఫ్యాన్స్ నుంచి విపరీతమైన ట్రోలింగ్స్ రావడంతో మకాం చెన్నైకి మార్చింది.  కానీ అక్కడ కూడా పవన్ ని వదలడం లేదు..పదే పదే జనసేన పార్టీపై విమర్శలు గుప్పిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి నోట పవన్ గురించి పాజిటీవ్ మాటలు వినిపించాయి. సాధారణంగా పవన్ కళ్యాన్ ప్రస్తావన వస్తే.. తిట్టడమో, అంతకు మించి బూతుల తిట్టడమో ఇవే వినిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి.  అయితే ఈసారి మాత్రం చాలా కూల్ గా కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్‌తో కలిసి బాలీ, కొడైకెనాల్, కేరళ లాంటి ప్రాంతాల్లో బోటు షికారుకు వెళ్లాలని ఉందంటూ మనసులో కోరికను బయటపెట్టింది శ్రీరెడ్డి. 

 

జాలీగా బాలీ ట్రిప్ వెళ్లే ఛాన్స్ వచ్చే పవన్ కళ్యాణ్‌తో కలిసి వెళ్తాను.  పవన్ కళ్యాణ్‌కి బుల్లెట్ కాఫీ, బాయిల్డ్ క్యారెట్‌లు ఇస్తా...అక్కడకు ఎందుకు తీసుకు వెళ్తారన్న ప్రశ్నకు అతనితో నాకు ఉన్న ప్లాబ్లమ్స్‌ని డిస్కస్ చేయడానికి. అతనితో రొమాన్స్ చేయడానికి కాదు అంటూ ట్విస్ట్ ఇచ్చింది.  అయితే ప్రస్తుతం  రాజకీయాలపై మాట్లాడారు. పవన్ కళ్యాన్  మంచి నాయకుడు అని అనిపిస్తే.. తప్పకుండా జనసేనలోకి వస్తానేమో. అయితే ఈ పది సంవత్సరాల్లో అయితే జనసేనలోకి వెళ్లే ఉద్దేశం లేదంటూ ట్విస్ట్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: