తెలుగులో ఫ్యామిలీ తరహా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన నటి అమని. మావిడాకులు, పెళ్లిపుస్తకం లాంటి సినిమాల్లో ఆమనికి మంచి పేరు వచ్చింది. కొంత కాలంగా సినిమాలకు దూరమైన ఆమె ప్రస్తుతం సెకండ్ సీజన్ మొదలు పెట్టింది. అప్పుడప్పుడు బుల్లితెరపై కనిపిస్తున్న ఆమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సౌందర్య అంటే నాకు ఎంతో ఇష్టమని నటి ఆమని అన్నారు. నేను .. సౌందర్య ఇద్దరం బెంగుళూరులోనే ఉండేవాళ్లం. ఇద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించాము. మా అలవాట్లు .. అభిప్రాయాలు .. అభిరుచులు అన్నీ చాలా దగ్గర పోలికలు ఉండేవి.
అప్పట్లో తన సహనటుల్లో ఆమె ఎంతో సౌమ్యంగా..సన్నిహితంగా ఉండేవారు. అప్పట్లో కె.విశ్వనాథ్ గారి సినిమాలలో నటించే అవకాశం రావడం నేను చేసుకున్న అదృష్టం. నేను చేసిన సినిమాలన్నీ నాకు బాగా నచ్చిన వాటిలో 'శుభసంకల్పం' స్థానం ప్రత్యేకం. ఈ మూవీలో నాకు చాలా విచిత్రంగా ఛాన్స్ వచ్చింది. అయితే హీరో కమల్ హాసన్ అనగానే నా పని అయిపోయిందని భావించాను. నిర్మాతగా బాలసుబ్రహ్మణ్యం, దర్శకుడిగా కె. విశ్వనాథ్, హీరోగా కమలహాసన్ గారు అందరూ దిగ్గజాలే. అలాంటివారితో కలిసి పనిచేయవలసి వచ్చింది.
ఇక కమల్ సరసన నటించడానికి వెళ్లగానే 'దడ' పుట్టేసింది. కానీ ఆయన పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు .. మనం ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తారు. అయితే ఆయన మాత్రం నాతో ఎంతో హ్యాపిగా గడిపారు..ప్రతి చిన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. అసలు కమల్ గారితో నటించడం అంటే నిజంగా ఎంతో నటన నేర్చుకున్నట్లే అని అర్థం అయ్యింది. అక్కడ పాత్రలే ఉంటాయి కనుక .. ఎలాంటి టెన్షన్ లేకుండా చేయగలిగాను అని చెప్పుకొచ్చారు. అందుకే ఆ సినిమా అంత హిట్ అయ్యింది..అందులో నా పాత్రకు కూడా అంత గౌరవం దక్కిందని తెగ సంతోష పడ్డానని చెప్పారు ఆమని.