సూపర్ స్టార్ మహేష్ మరియు యువ దర్శకుడు అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు తొలిసారిగా ఒక ఆర్మీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ ని, ముందుగా అనుకున్న విధంగా కాకుండా ఒక రోజు ముందుకు తీసుకువచ్చి జనవరి 11న రిలీజ్ చేయాలని నిర్ణయించి కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది సినిమా యూనిట్. ఇక ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడం విశేషం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా మరొక హీరోయిన్ సంగీత, కమెడియన్ బండ్ల గణేష్ కూడా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తన్నారు. 

 

పక్కా కమర్షియల్, మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయి, అదరగొట్టే వ్యూస్ తో దూసుకుపోతోంది. టీజర్ లో మంచి యాక్షన్ తో పాటు మాస్, ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా కలగలిసి ఉన్నాయి. ఆకట్టుకునే విజువల్స్, డైలాగ్స్, మాస్ యాక్షన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ టీజర్ అదిరిపోయినదనే చెప్పాలి. ఇక టీజర్ లో 'సంక్రాంతికి అల్లుడు వస్తాడు అనుకుంటే మొగుడు వచ్చాడేంటి' అంటూ ప్రకాష్ రాజ్ పలికే డైలాగ్, 'మేము అక్కడ మీ కోసం ప్రాణాలు ఇస్తుంటే, మీరేమో కత్తులు గొడ్డళ్లు తీసుకుని ఇక్కడ ప్రాణాలు తీస్తున్నారు,,,బ్యాత్యత ఉండక్కర్లేదా' అంటూ మహేష్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఇక ఈ టీజర్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా అమాంతం పెరిగాయి అని చెప్పక తప్పదు. 

 

అనిల్ సుంకర, మహేష్ బాబు, దిల్ రాజు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. వరుసగా భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్న సూపర్ స్టార్, తప్పకుండా ఈ సినిమాతో మరొక హిట్ కొట్టి, హ్యాట్రిక్ ని సొంతం చేసుకోవడం ఖాయం అని మహేష్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. మరి సంక్రాంతి కానుకగా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా, ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి .......!!

మరింత సమాచారం తెలుసుకోండి: