హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొని జోష్ మీదున్నాడు. అంతకుముందు వరుస ప్లాపులతో పడిన బాధను మరచిపోయి మరో సినిమా చేస్తున్నాడు.. ఇక భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవిందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ నిర్మాతగా అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం 'ప్రతిరోజు పండగే'.

 

 

సినిమా ఇటీవలే ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ పాట చిత్రీకరణ ఇప్పుడు జరుగుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. థమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పెప్పీ నెంబర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన గ్రాండ్ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

 

 

ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందట. ఇప్పుడు ఈ పాటను అందమైన లొకేషన్ లో చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలను కూడా విడుదల చేసారు. ఈ రెండూ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. సినిమా చాలా ఆహ్లాదంగా సాగిపోతుందని తప్పకుండా అందరికీ నచ్చుతుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

 

 

ఈ చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ప్రధానంగా సాగుతుందని తేజ్ కు తాతగా నటించిన సత్యరాజ్ పాత్ర ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ అని అంటున్నారు. దీంతో పాటు రావు రమేష్ పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇకపొతే గీత ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరి తేజ్ ఎదురుచూస్తున్న ఆ భారీ హిట్, ఈ చిత్రం వచ్చి అతని ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: