సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా అఫీషియల్ టీజర్ మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన వీక్షకధారణతో పాటు అదరగొట్టే రేంజ్ లో వ్యూస్ మరియు లైక్స్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. మహేష్ బాబు, మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇకపోతే సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు తారా స్థాయిలో ఉండడంతో, 

 

ఆ అంచనాలు తప్పకుండా అందుకుంటాం అని దర్శకుడు అనిల్ రావిపూడి స్పష్టం చేస్తున్నారు. ఇకపోతే మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న అలవైకుంఠపురములో సినిమా నుండి ఇప్పటికే మూడు సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా అలరిస్తూ, లైక్స్ మరియు వ్యూస్ పరంగా పలు రికార్డ్స్ తో దూసుకుపోతున్నాయి. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లు ఎంతో భారీగా నిర్మిస్తున్నాయి. 

 

సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరి సంక్రాంతి పుంజులుగా అతి త్వరలో కేవలం ఒక్కరోజు గ్యాప్ తో బాక్సాఫీస్ ముందుకు రాబోతున్న ఈ రెండు సినిమాల్లో దేనిది పైచేయి అని అంటే మాత్రం ఒక్కసారిగా చెప్పాడం కష్టం అనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే రెండు సినిమాలు కూడా మంచి క్రేజీ కాంబినేషన్స్ తో తెరకెక్కుతున్నాయి, అలానే రెండిటికి ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు, రెండిటిపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉండడంతో పక్కాగా ఏది ఎక్కవ అనేది చెప్పడం కష్టం అని, అయితే రెండు సినిమాలు కూడా థియేటర్స్ లోకి వచ్చిన తరువాత కానీ దేని స్టామినా ఎంతవరకు ఉంది అనేది పూర్తిగా చెప్పగలం అని వారు అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: