పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సినిమాల్లోకి రీఎంట్రీకి సంబంధించి ఇటీవల ఒక ప్రకటన కూడా రిలీజ్ అవడం జరిగింది. కొన్నాళ్ల క్రితం అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో రూపొందిన పింక్ సినిమా అధికారిక రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించబోతున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ తెరకెక్కించబోయే ఈ సినిమాకు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, మరియు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ లు కలిసి నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా విషయమై కొద్దిరోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ప్రకటన రిలీజ్ చేసినప్పటికీ, 

 

అధికారిక ప్రకటన కోసం పవన్ ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, నేడు దిల్ రాజు ఈ సినిమా విషయమై తన సన్నిహితులతో కన్ఫర్మ్ చేసారని, మరికొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన కూడా రిలీజ్ కాబోతోందని చెప్తున్నారు. ఇక బోనీ కపూర్ కూడా మొన్న అక్కినేని అవార్డు ఫంక్షన్ సమయంలో హైదరాబాద్ విచ్చేసి పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలిసి సినిమా ప్రారంభం విషయమై కాసేపు చర్చించినట్లు సమాచారం. 

 

అన్ని కలిసి వస్తే కేవలం మరికొద్దిరోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు మీడియా ముఖంగా అందరికి వెల్లడి అవుతాయని టాక్. వాస్తవానికి ఈ సినిమా కోసం ఒక పెద్ద కోర్ట్ సెట్టింగ్ ని ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో రూపొందించడం ప్రారంభించినట్లు కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన జనసేన పార్టీ కార్యక్రమాలతో కొంత బిజీగా ఉండడం వల్లనే ఇంత ఆలస్యం అయిందని తెలుస్తోంది. కాగా పవన్ ఈ ఒక్క సినిమాలోనే నటిస్తారా లేక ఈ విధంగానే మరికొన్ని సినిమాల్లో నటిస్తూ ముందు వెళ్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: