సీనియర్ నటుడు అరవింద స్వామి కి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను ఎలాంటి ఇమేజ్ ఉందో అందరికి తెలిసిందే. మణిరత్నం డిస్కవరీ గా ఈ మిస్టర్ పెర్ఫెక్ట్  కి అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ ఇప్పటికీ ఎవరు ఊహించలేరు. వరుసగా తమిళ బ్లాక్ బస్టర్స్ లో నటిస్తూ ఎప్పటికప్పుడు తన క్రేజ్ అందనంత ఎత్తుకు తీసుకు వెళుతున్నాడు. ఇంతకు ముందు మణిరత్నం 'నవాబ్' సినిమాలో రొమాంటిక్ కార్పొరెట్ గురూగా కనిపించి అందరిని విపరీతంగా ఆకట్టుకున్నాడు. అధితీరావ్ హైదరి తో అరవింద స్వామి రొమాన్స్ యూత్ ఎప్పటికి మర్చిపోలేరు.

ఇక రామ్ చరణ్ ధ్రువ సినిమాలో నటించి తెలుగు జనాలకి ఇంకా దగ్గరయ్యాడు. అరవింద్ స్వామి లాంటి పర్ఫెక్షనిస్ట్ కోసం నిర్మాతలు ఎంత పెద్ద రెమ్యూనరేషన్ అయినా ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అయితే స్వామీ కాల్షీట్లు పట్టు కోవడం ఎంత కష్టమో ఇంతకు ముందు ధ్రువ సమయంలో చరణ్ అండ్ టీమ్ కి స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు అదే తరహా అనుభవం తళా అజిత్ టీమ్ కి ఎదురైందని తాజా సమాచారం. ప్రస్తుతం తళా అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో 'వలిమై' అనే భారీ సినిమాని నిర్మించేందుకు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సన్నాహాల్లో ఉన్నారు. నేర్కొండ పార్వాయ్ (పింక్ రీమేక్) తర్వాత మరో భారీ సినిమా అజిత్-వినోద్-బోనీ కాంబినేషన్ లో రాబోతోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ జరుగుతున్న ఈ సినిమాకి నటీనటుల ఎంపిక జగుతోంది. ఇక ఈ సినిమాలో అజిత్ తో పోటీపడే ఓ కీలక పాత్రకు అరవిందస్వామిని సంప్రదించారు. కానీ ఆ ప్రపోజల్ కి స్వామి మొహమాటం లేకుండా తిరస్కరించాడట. కనీసం స్క్రిప్టు కూడా వినకుండానే బోనీ ఆఫర్ ని కాదన్నాడట. 

అయితే అందుకు బలమైన కారణమే ఉందట. అమ్మ జయలలిత బయోపిక్ కోసం అరవింద స్వామి బల్క్ గా కాల్షీట్లు కేటాయించాడు. ఆ సినిమా లో లెజెండరీ నటుడు.. నాయకుడు అయిన ఎం.జీ.రామచంద్రన్ పాత్రలో  స్వామీ నటిస్తున్నాడు. దీనిని ఛాలెంజింగ్ గా భావించి ఎంతో కసరత్తు చేస్తున్నాడట. అందుకే బోనీ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది. ఇక అజిత్ - వినోద్ కాంబినేషన్ సినిమాకి సంబంధించిన లుక్ ఒకటి ఇంతకు ముందు రివీలైంది. ఇందులో అజిత్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. పైగా ద్విపాత్రాభినయంతో రచ్చ చేయబోతున్నాడట. ఈ సినిమాలో నయనతార అజిత్ కి జంటగా నటించనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: