సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాము నటించిన సినిమాలు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ముందుగా అల్లు అర్జున్ విషయానికి వస్తే ‘నా పేరు సూర్య’ లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన ‘అల వైకుంఠ పురంబులో’ సినిమా కథకి ఓకే చేసి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా సినిమా కి సంబంధించిన విడుదలైన పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు ఇంటర్నెట్ ప్రపంచంలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ సినిమా పై అంచనాలు మరింత పెంచేశాయి.

 

ఇదిలా ఉండగా మరోపక్క మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ అయి అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ...సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉండగా రాబోయే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ ఇద్దరు హీరోల టార్గెట్ ఒకటే అన్నట్టు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

 

అదేమిటంటే ఈ సంక్రాంతికి ఎలాగైనా ఇద్దరు హీరోలు హ్యాట్రిక్ కొట్టాలని ఆరాటపడుతున్నట్టు సమాచారం. డీటెయిల్ గా విషయంలోకి వెళితే...త్రివిక్రమ్ అల్లు అర్జున్ చేసిన గత రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో అలా వైకుంఠపురం లో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని బన్నీ ఫుల్లుగా డిసైడ్ అవ్వగా...మరోపక్క మహేష్ వరుసగా రెండు బ్లాక్ బస్టర్ విజయాలు దక్కించుకోవడం తో…’సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నారు. సో ఈ సంక్రాంతికి ఇద్దరు హీరోల సినిమాలు హ్యాట్రిక్ రిజల్ట్ చుట్టూ టాక్ తిరగబోతున్నట్లు అర్థమవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: