స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గతంలో చేసిన డీజే, నాపేరు సూర్య సినిమాలతో తన ఫ్యాన్స్ ని ఒకింత నిరాశ పరిచారు అనే చెప్పాలి. అయితే వాటిలో డీజే పర్వాలేదనిపించినప్పటికీ నాపేరు సూర్య మాత్రం అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలం అయిందనే చెప్పాలి. రచయిత వక్కంతం వంశీ తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించిన ఆ సినిమాపై అప్పట్లో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే చివరకు రిలీజ్ తరువాత సినిమా ఆ అంచనాలు అందుకోలేకపోయింది. ఇక దాని తరువాత కొంత ఆలోచనలో పడ్డ అల్లు అర్జున్, ఆపై త్రివిక్రమ్ తయారు చేసిన అద్భుతమైన కథకు పచ్చ జెండా ఊపారు. ఆ సినిమానే అలవైకుంఠపురములో. 

 

ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతోంది సినిమా యూనిట్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన మూడు సాంగ్స్ కూడా యూట్యూబ్ లో అదిరిపోయే వ్యూస్ మరియు లైక్స్ దక్కించుకోవడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా బిజినెస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగ్తున్నప్పటికీ, ఒక్క ఓవర్సీస్ లో మాత్రం ఒకింత వెనుకపడినట్లు చెప్తున్నారు. అయితే సరిగ్గా అదే సమయానికి రిలీజ్ అవుతున్న సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు ఓవర్సీస్ లో ఇటీవల భారీ ధరకు అమ్ముడుపోగా, 

 

అలవైకుంఠపురములో విషయమై మాత్రం బయ్యర్లు కొంత ఆలోచిస్తున్నట్టు టాక్. అయితే దానికి ఒక ముఖ్య కారణం ఉందట. నిజానికి అలవైకుంఠపురములో సినిమా యూనిట్, తమ సినిమాకు చెప్తున్న ధర మరీ ఎక్కువగా ఉందని, తాము అనుకున్న దానికంటే ఎక్కువధరకు అలవైకుంఠపురములో యూనిట్ ధరను పెంచడంతో బయ్యర్లు కొంత ఆలోచిస్తున్నారని అంటున్నారు. అయితే ఓవర్ ఆల్ గా మాత్రం ఆ సినిమాకు ఫైనల్ గా మంచి ధర లభించే అవకాశం ఉందట. ఇక నేడు ఈ వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా దీనిపై ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: