సంక్రాంతి దగ్గరపడుతోంది. రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ అంతకంతకు పెరుగుతోంది. ముందుగా సోషల్ మీడియాలో వ్యూస్ తోనే పెద్ద యుధ్ధం జరుగుతోంది ఆ హీరోకి ఇన్ని లక్షల వ్యూస్ వచ్చాయంటే మేమే టాప్ అనుకుంటూ ఇద్దరి ఫ్యాన్స్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు, ఇవన్నీ ఇలా ఉంటే అల వైకుంఠపురంలో మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైరెక్టర్. ఆయన మ్యాజిక్ అలా ఇలా ఉండదుగా.

 

ఈ మూవీలో ఆయన ఏరి కోరి సీనియర్ యాక్ట్రెస్ టబుని సెలెక్ట్ చేశాడు. మూడు దశాబ్దాల క్రితం కలయా నిజమా అంటూ టబు చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. ఆ తరువాత ఈ అమ్మడు ప్రేమ దేశంలో  ఇద్దరు యువకులకు పోటీ పెట్టి నాటి యూత్ హార్టులను భళ్ళున బద్దలుకొట్టేసింది. ఇక అక్కినేని నాగార్జున నిన్నే పెళ్ళాడుతా లో టబు పండుగా చేసిన నటన ఎవరూ మరచిపోలేరు.

 

అదే విధంగా ఆమె అందం కూడా ఆ మూవీకి పెద్ద అసెట్. ఇవన్నీ ఇలా ఉంటే టబు తన అందంతో ఇప్పటికీ నాటౌట్ అంటోంది. ఆమెను అల వైకుంఠపురంలో త్రివిక్రం తీసుకోవడం వెనక లెక్కలు చాలా ఉన్నాయి అంటున్నారు. ఇక టబు ఈ మూవీకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు. టబు సైతం తన గ్లామర్ ని ఆలాగే కాపాడుకుంటూ యూత్ ని మరో సారి తట్టిలేపనుందని టాక్.

 

ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఉంది. అయితే ఆమెతో సమానంగా టబు కూడా తనవైపు ఆడియన్స్ కి తిప్పుకుంటుందని అంటున్నారు. ఈ మూవీలో టబు క్యారక్టర్ డిజైన్ చేసిన విధానం కూడా అలా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి అత్తారింటికి దారేది మూవీలో నదియాను అదిరిపోయేలా చూపించిన  త్రివిక్రం ఈ మూవీలో కూడా టబు ని గొప్పగా చూపిస్తాడని అంటున్నారు. అల వైకుంఠపురంలో టబు కొసం అంతా వెయింటింగ్ మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: