పూజా హెగ్డే... సొగసరి అందాలతో అందరినీ అందర్నీ కట్టిపడేస్తు... అదిరే అభినయంతో అందరి చూపులు తన వైపు తిప్పుకోవడం ఈ అమ్మడు సొంతం. నేటి తరం కథానాయికల్లో నాటి తరం ప్రేక్షకులను కూడా అలరిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే. అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నది ఈ అమ్మడు. తెలుగు చిత్ర పరిశ్రమకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో జోడి కట్టి ముకుంద సినిమా తో పరిచయమైంది అందాల భామ పూజా హెగ్డే. గ్లామర్ పాత్రల్లో మెరుస్తూనే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చేసుకొని దూసుకు పోతుంది ఈ హాట్ బ్యూటీ. గ్లామర్ పాత్రల్లో హాట్ అందాలను ఆరబోస్తూ అందరికీ చమటలు పట్టిస్తూనే... నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చేస్తూ తన అభినయంతో ఔరా అనిపిస్తుంది.ముకుందా సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేసులో పరుగులు పెడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన మెరిసింది ఈ హాట్ బ్యూటీ . అంతేకాదండోయ్ అటు బాలీవుడ్ లో కూడా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించింది పూజ హిగ్డే .
అంతే కాదు తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది ఈ అమ్మడు. టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత లో తనకి క్యూట్ అందాలతో అందరిని మైమరపించిన ఈ అమ్మడు... ఆ తర్వాత మహేష్ బాబుతో మహర్షి సినిమాలో నటించి తన చలాకీతనంతో అందరిని ఎంటర్టైన్ చేసింది. ఇక తాజాగా విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమాలో కూడా పల్లెటూరి అమ్మాయి పాత్రలో అందరిని మెస్మరైజ్ చేసింది అందాల భామ పూజ హుగ్డే . ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ లు గా నిలుస్తుండడంతో మరిన్ని అవకాశాలు చేజిక్కించుకుంటుంది ఈ బ్యూటీ . వరుస హిట్లతో దూసుకుపోతు తన సినీ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది. తాజాగా మీడియా తో మాట్లాడిన పూజా హెగ్డే... కెరియర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు తాను ఎప్పుడూ ముందు ఉంటానని చెప్పుకొచ్చింది ఈ భామ . జీవితంలో సాహసాలు చేయడం చాలా అవసరం అని చెబుతున్నారు. మనం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అందరిలో మనం ప్రత్యేకంగా నిలబెడుతుంది అంటుంది అందాల భామ. జీవితాన్ని కంఫర్టబుల్గా బతకడంలో ఆనందం ఉందని అంటుంటారు చాలామంది. అందులో భాగంగానే ఒకే రకమైన లైఫ్ కు అలవాటు పడిపోతున్నారు. అలా బతకడంలో తప్పేం లేదు కానీ మనకు గుర్తింపు రావాలంటే మాత్రం
.. అందరికంటే భిన్నంగా ఆలోచించాల్సి అంటుంది.కొత్తగా ప్రయత్నించినప్పుడు ఎదురు దెబ్బలు తగులుతాయి... వాటన్నింటినీ తట్టుకుని నిలబడి నప్పుడు మాత్రమే అందరిలో మనం ప్రత్యేకంగా కనిపిస్తాము అంటూ చెప్పుకొచ్చింది.