‘బాహుబలి’ వంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ అంచనాల మధ్య విడుదలయి ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దాదాపు రెండు సంవత్సరాల పాటు ప్రభాస్ ఈ సినిమాకి టైం కేటాయించడంతో ప్రభాస్ అభిమానులు సినిమా టీజర్ చూసి హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉంటుందని భావించడంతో. ...సినిమా తెరపై పడిన మొట్ట మొదటి షోకే ప్లాప్ టాక్ బయటకు రావడంతో పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు ప్రభాస్ అభిమానులు. ఇదే క్రమంలో డైరెక్టర్ సుజిత్ పై కూడా విమర్శల వర్షం కురిపించారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న జిల్ ఫిలిం డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా గురించి ఎలాంటి వార్త బయటకు రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు ట్విట్టర్లో రచ్చ రచ్చ చేస్తున్నారు.

 

సినిమాకి సంబంధించి ఎటువంటి వార్తలు మరియు ఎలాంటి అప్డేట్స్ చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేయకపోవడంతో అదే విధంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్న క్రమంలో అసలు సినిమా షూటింగ్ జరుగుతుందా...? లేదా...? అన్న సమాచారాన్ని కూడా భయటపెట్టకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో రెచ్చిపోయారు. తమ అభిమాన హీరో 20వ సినిమా గురుంచి అప్డేట్ ఇవ్వాలని కోరుతూ we want prabhas 20 update అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ యువీ క్రియేషన్స్ కి ట్యాగ్ చేస్తున్నారు.

 

ఇంకేముంది ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయి ట్వీట్లు చేస్తుండడంతో ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్లు 'సాహో' సినిమా నిర్మించిన యు.వి క్రియేషన్స్ అదేవిధంగా గోపికృష్ణ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ జాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: