టాలీవుడ్ హీరోల స్నేహాలు అన్నీ కూడా బయటకు  మాత్రమే కనిపిస్తాయని  అంటారు. పొరుగున ఉన్న తమిళనాడులో చూస్తే టాప్ స్టార్స్ గా ఉన్నా కూడా రజనీకాంత్, కమల్ హాసన్ ల మధ్య ఇప్పటికీ మంచి స్నేహం ఉంది. అక్కడ అందరూ కలసిమెలసి ఉంటారు. ఒక సమస్య వస్తే నిలబడతారు కూడా. టాలీవుడ్ తీరు అందుకు భిన్నం. ఏ కార్యక్రమం నిర్వహించినా సగానికి సగం మంది డుమ్మా కొడతారు. ఎందుకో తెలియదు కానీ బలవంతంగా ముఖాలపైన  నవ్వులు పూయించుకుంటారని కూడా ప్రచారం ఉంది.

 

ఇదిలా ఉండగా మెగాస్టార్ ఇంట్లో జరిగిన ఎయిటీస్ రీ యూనియన్ 10వ వార్షికోత్సవానికి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దాదాపుగా నలభై మంది వరకూ  అగ్ర నటులు వచ్చారు.  అగ్ర నటీమణులు  కూడ వచ్చారు. ఇందులో పెద్దా చిన్నా తేడా లేకుండా అంతా కలసి  ఒక రోజంతా ఆనందంగా గడిపారు. టాలీవుడ్ నుంచి కూడా నాగార్జున, వెంకటేష్ హాజరయ్యారు. అయితే టాలీవుడ్ సీనియర్ హీరో 1974లోనే ఇండస్ట్రీలో ప్రవేశించిన  నందమూరి బాలక్రిష్ణ మాత్రం హాజరు కాలేదు.

 

ఆయన గైర్  హాజరు ఇపుడు పెద్ద  చర్చగా ఉంది. గ్రూప్ ఫోటోలలో కూడా బాలయ్య లేకపోవడం కచ్చితంగా కనిపిస్తోంది. మరి ఈసారి రీ యూనియన్ ఫంక్షన్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగింది. పైగా ఇది 10వ వారిషికోత్సవం. ఇంతటి కీలకమైన సమావేశానికి బాలయ్య డుమ్మా కొట్టాడు అంటే ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడంలేదని అంటున్నారు.

 

బాలక్రిష్ణ చిరంజీవిల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని అంటారు. తనకు ఇండస్ట్రీలో మంచి మిత్రుడు చిరంజీవి మాత్రమేనని బాలయ్య అనేక సందర్భాలలో చెప్పాడు కూడా. అయితే బాలయ్యకు నాగ్ తో విభేదాలు ఉన్నట్లుగా  అప్పట్లో ప్రచారం జరిగింది. మరి నాగ్ ఇపుడు చిరంజీవితో రాసుకుపూసుకుని తిరుగుతున్నాడు. అందువల్ల ఈ ఫంక్షన్లో నాగ్ తో పాటు మరికొందనికి అవాయిడ్ చేయాలన్న ఉద్దేశ్యంతో బాలయ్య రాలేదా అన్న ప్రచారం కూడా ఉంది.

 

అదే విధంగా బాలయ్యకు పిలుపుల విషయంలో కూడా బాగానే  పట్టింపులు ఉన్నాయి. ఆయన్ని సరిగ్గా పిలవలేదా అన్న మాట కూడా వినవస్తోంది. మొత్తం మీద చూస్తే గతంలో అనేకసార్లు రీ యూనియన్ మీటింగుల్లో పాల్గొన్న బాలయ్య ఈసారి తెలుగు గడ్డ మీద అదీ మెగాస్టార్ ఇంట్లో తారలు  అంతా కలస్తే తాను రాకపోవడం అంటే పెద్ద చర్చగా ఉంది. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం తమ హీరో ఎందుకు వెళ్ళలేదోనని బాధపడుతున్నారుట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: