టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా అలవైకుంఠపురములో. ఇప్పటికే బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి హిట్ సాధించి ఉండడంతో, తప్పకుండా ఈ సినిమా ద్వారా వారిద్దరూ హ్యాట్రిక్ కొట్టి తీరుతారని బన్నీ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

 

కుటుంబంలోని బంధాలు, అనుబంధాల నేపథ్యంలో మంచి కమర్షియల్ ఫార్మాట్ లో త్రివిక్రమ్ మార్క్ పంచెస్ తో సిద్ధం అవుతున్న ఈ సినిమా నుండి ఎస్ ఎస్ థమన్ స్వరపరిచిన మూడు సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా అలరించడంతో పాటు అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ దక్కించుకోవడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా నుండి అతి త్వరలో నాలుగవ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతోందట సినిమా యూనిట్. డిసెంబర్ తొలివారంలో రిలీజ్ కాబోయే ఈ పాట, హీరో మరియు హీరోయిన్ల మధ్య వచ్చే మంచి రొమాంటిక్ సాంగ్ అని, 

 

ఇక ఇటీవల రిలీజ్ అయిన మూడు సాంగ్స్ మాదిరిగానే ఈ సాంగ్ కూడా మంచి సక్సెస్ సాదిస్తుందని సినిమా యూనిట్ మంచి నమ్మకంగా ఉందట. సీనియర్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సునీల్, మురళి శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని, నవీన్ నూలి ఎడిటింగ్ ని అందించడం జరిగింది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: