అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి సంస్థ నిర్మాణంలో  ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "మిస్ మ్యాచ్". ఆట గదరా శివా సినిమా ఫేమ్ ఉదయ్ శంకర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, తెలుగులో కౌసల్య క్రిష్ణమూర్తి పేరు తో వచ్చిన క్రికెట్ డ్రామాలో ముఖ్య పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న’మిస్ మ్యాచ్’ విడుదలకు సిద్ధమైంది. 

 

ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్ ను పొందింది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న ‘మిస్ మ్యాచ్’ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు ఇటీవలే మీడియాకు అధికారికంగా ప్రకటించారు.తాజాగా 'మిస్ మ్యాచ్' సినిమాకు త్రివిక్రమ్ తన వంతు ప్రోత్సాహం అందించారు. చిత్రంలోని మొదటిపాట అరెరే అరెరేను ఆయన విడుదల చేశారు.

 

ఈ సందర్బంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ.. 'మిస్ మ్యాచ్' టైటిల్ కొత్తగానూ, ఆసక్తికరంగాను ఉందని అన్నారు. డైరెక్టర్ నిర్మల్ తీసిన సలీం సినిమా తమిళ్, తెలుగులో మంచి విజయం సాధించింది. తెలుగులో అతను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న 'మిస్ మ్యాచ్' సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఆ తర్వాత హీరో ఉదయ్ శంకర్ త్రివిక్రమ్ గురించి మాట్లాడారు.

 

త్రివిక్రమ్ గారు మా పాట విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నా మొదటి సినిమా ఆట గదరా శివా సినిమాకి త్రివిక్రమ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. మాకోసం ఇక్కడి వరకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు దన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నాడు. మొదటి పాటని తివిక్రమ్ గారి చేతుల మీద లాంచ్ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపాడు.  మరి త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకుడితో పాట లాంచ్ చేయించడం ఈ సినిమా ప్రమోషన్ కి ఉపయోగపడుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: