టాలీవుడ్ స్టార్ హీరో  రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రేక్షకుల యంగ్ రెబల్ స్టార్ గా మారిపోయాడు. అయితే బాహుబలి సినిమా వరకు టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ బాహుబలి సెన్సేషనల్ హిట్  తర్వాత ప్రపంచం నలుమూలలా పాకిపోయింది. ప్రభాస్ సినిమా వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా  ఎదురు చూసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. బాహుబలి లాంటి  సినిమా  తర్వాత భారీ అంచనాలతో విడుదలైన సాహో సినిమా ప్రభాస్ అభిమానులను కాస్త  నిరాశపరిచినదనే  చెప్పాలి. భారీ అంచనాలతో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో సాహో సినిమా తెరపైకి వచ్చినప్పటికీ కథ పరంగా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. కాగా ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్

 

 

 

 అయితే ప్రస్తుతం ప్రభాస్ పై అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ పై  అభిమానులు  అసహనం  వ్యక్తం చేయడం ఏంటి అనుకుంటున్నారా... దానికి కారణం ఏంటంటే... ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ  సినిమాతో బిజీగా బిజీగా ఉన్నాడు. అయితే రాధాకృష్ణ దర్శకత్వంలో  ప్రభాస్ నటిస్తున్న సినిమా ప్రభాస్ కి   20వ  సినిమా. కాగా  రాధాకృష్ణ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కథలో కొన్ని మార్పులు చేయాలంటూ... జనవరి వరకు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అటు దర్శకుడు రాధాకృష్ణ ఈ కథలో మరిన్ని మార్పులు చేస్తున్నారు. అయితే భారీ అంచనాలతో విడుదలైన సాహో చిత్రం ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవడం వల్ల ఈ  సినిమా కథలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

 

 అయితే రాధాకృష్ణ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జాన్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే నటిస్తోంది. కాగా 60వ దశకం కథతో జాన్ సినిమా తెరకెక్కబోతుంది. సినిమాలో ప్రభాస్ జాతకాలు చెప్పే పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే జిల్ సినిమా తర్వాత ఐదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడు రాధాకృష్ణ ప్రభాస్ తో  సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినప్పటినుంచి ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా బయటికి రాలేదు. చిత్ర యూనిట్ కూడా  అప్డేట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదు. దీంతో అభిమానులు అందరూ తమ అభిమాన హీరో ప్రభాస్ కు సంబంధించిన అప్డేట్ కావాలి అంటూ ట్విట్టర్ లో కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ ను టాగ్  చేస్తూ ప్రభాస్ 20వ సినిమా అప్డేట్స్  కావాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ హాష్ టాగ్ తో  మొత్తం 2.12 లక్షల కోట్లు కామెంట్లు రావటం  విశేషం. మరి దీనిపై ప్రభాస్ స్పందిస్తాడో  లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: