హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతి పోగొట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించే తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని  పరీక్షించుకుంటోంది. గత కొంతకాలంగా టాలీవుడ్ లో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గినప్పటికీ అటు బాలీవుడ్లో మాత్రం ఈ అమ్మడు దూసుకుపోతోంది. అయితే టాలీవుడ్ లో  సినిమాలకు దూరం గానే ఉన్నప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులను మాత్రం అలరిస్తూనే ఉంటుంది ఈ అమ్మడు. హాట్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... అభిమానులందరికీ చెమటలు పట్టిస్తోంది. ఇక టాలీవుడ్ లో పరేషానునురా పరేషానురా అంటూ తన హాట్ హాట్ అందాలతో ఎంతోమందికి చెమటలు పట్టించి పరేషాన్ చేసింది  ఈ హాట్ బ్యూటీ. బాలీవుడ్లో ఇప్పటికే స్టార్ హీరోలందరి సరసన మెరిసింది ఈ ముద్దుగుమ్మ . 

 

 

 

 అయితే టాలీవుడ్లో కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఏ ఈవెంట్  జరిగినా అక్కడ వాలిపోతుంది ఈ అమ్మడు. టాలీవుడ్ లో అన్ని ఈవెంట్ లలో  ప్రత్యక్షం అయి పోతుంది. అందం అభినయం కలగలిసిన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతుంది. అయితే తాజాగా విశాఖపట్నంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చిన్నపిల్లలపై జరిగే లైంగిక వేధింపులపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. చిన్న వయసు నుంచే పిల్లలకు లైంగిక  వేధింపులపై  చైతన్యం కల్పించాలంటూ తల్లిదండ్రులకు సూచించింది. 

 

 

 

 విశాఖపట్నంలో నిర్వహించిన 555కే  2.0 వాక్  ముగింపు కార్యక్రమంలో పాల్గొనది ఈ బ్యూటీ . ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మంచి  స్పర్శకు చెడు  స్పర్శకు తేడాని చిన్నతనంలోనే తల్లితండ్రులు అమ్మాయిలకు అవగాహన కల్పించాలని సూచించింది. ఇప్పుడున్న రోజుల్లో ఇది చాలా అవసరం  అంటూ చెప్పుకొచ్చింది రకుల్ . ఇప్పటి కాలంలో అమ్మాయిలు కనిపిస్తే చాలు అసభ్యకరమైన తాకేవాళ్ళు  రోజురోజుకు ఎక్కువవుతున్నారు  అంటూ తెలిపింది . అలా అమ్మాయిలు అసభ్యకరంగా తాకేవాళ్ళు తేడాగాళ్లు  అంటూ చెప్పింది . అలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని తాను కోరుకుంటున్నానని అంటూ చెప్పుకొచ్చింది. అయితే రకుల్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: