అనుష్క లీడ్ రోల్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం "నిశ్శబ్దం". ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. భాగమతి తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో చేస్తున్న చిత్రం "నిశ్శబ్దం". బాహుబలి ద్వారా అనుష్కకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అందువల్ల ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ, మళయాల భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

 

అయితే ఈ సినిమాలో అనుష్క ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తుంది. మూగ మరియు చెవుడు గల పెయింటర్ గా మనకు కనిపించనుంది. మూగ, చెవుడు గల అనుష్క ఒకానొక కేసులో ఇరుక్కుంటే ఎలా బయటకి వచ్చిందన్నదే కథ అని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ని బట్టి తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మాధవన్ కూడా ఉన్నాడు. మాధవన్ గుడ్డివాడిగా నటిస్తూ వయోలిన్ ప్లేయర్ గా కనిపించనున్నాడు.

 

అయితే ఈ రోజు ఈ సినిమా నుండీ మరో పోస్టర్ రిలీజైంది. అర్జున్ రెడ్డి సినిమా హీరోయిన్ అయిన షాలినీ పాండే పోస్టర్ ని ఈ రోజు రిలీజ్ చేశారు.  షాలినీ పేరు సోనాలీ కాగా ఆమె ప్రధాన పాత్ర అయిన సాక్షి (అనుష్క)  వాయిస్ గా ఉండనుందట. అంటే ఒకానొక కేసులో సాక్షి (అనుష్క) తరపున తన గొంతు వినిపించే అమ్మాయిగా పాత్ర అయి ఉంటుందని అర్థం అవుతుంది. మరి అర్జున్ రెడ్డిలో తన నటన ద్వారా అందరినీ మెప్పించిన షాలినీ ఈ సినిమాలో ప్రేక్షకులని ఆకర్షిస్తుందా లేదా చూడాలి.

 


ఇప్పటికే రిలీజ్ చేసిన అంజలి పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు విడుదలైన ఈ పోస్టర్ కూడా మరో మారు నిశ్శబ్దం గురించి మాట్లాడుకునేలా చేసింది. అనుష్క పుట్టిన రోజున విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అరుంధతి, భాగమతి వంటి హారర్ చిత్రాలలో మెప్పించి సూపర్ హిట్స్ అందుకున్న అనుష్క నిశ్శబ్దం చిత్రంలో ఎలా నటిస్తారో చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: