సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబోలో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అదే టైంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రం కాంబోలో వస్తున్న అల వైకుంఠపురములో కూడా రిలీజ్ ప్లాన్ చేశారు. ముందు రెండు సినిమాలు ఒకే డేట్ రిలీజ్ అని ఎనౌన్స్ చేయగా ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే చర్చల ఫలితంగా జనవరి 11న మహేష్.. 12న బన్ని సినిమాలు వస్తున్నాయి.

 

ఇదిలాఉంటే సంక్రాంతికి వచ్చే సినిమాల సందడి అప్పుడే మొదలైంది. ప్రమోషన్స్ లో ఎప్పుడూ చురుకుగా ఉండే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా విషయంలో కూడా తన పంథా కొనసాగించాడు. సినిమా నుండి మొదటి సాంగ్ సామజవరగమన రిలీజ్ చేయించాడు. అంతే ఒక్కసారిగా అల వైకుంఠపురములో సినిమాపై అంచనాలు పెరిగాయి.

 

అంతకుముందే ఫస్ట్ లుక్ గ్లింప్స్ వచ్చినా ఈ సాంగ్ బీభత్సం సృష్టించింది. ఆ తర్వాత రాములో రాములా సాంగ్ కూడా వచ్చింది. అది సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ రెండిటి తర్వాత ఓ మై గాడ్ డ్యాడీ సాంగ్ కూడా రిలీజైంది. బన్ని సినిమా ఇలా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తుంటే మహేష్ సరిలేరు నీకెవ్వరు టీం మొన్నటి వరకు సైలెంట్ ఉన్నారు. రీసెంట్ గా సరిలేరు టీజర్ తో తన సత్తా చూపించాడు మహేష్.

 

సరిలేరు టీజర్ రిలీజ్ తర్వాత అల వైకుంఠపురములో సినిమాకు బజ్ తగ్గింది. అందుకే ఇప్పుడు బన్ని సరిలేరు టీజర్ కు పోటీగా తన సినిమా టీజర్ రిలీజ్ ప్లాన్ చేశాడట. కచ్చితంగా టీజర్ తోనే ఓ మంచి ఇంప్రెషన్ కొట్టేయాలని చూస్తున్నాడు బన్ని. సంక్రాంతికి ఈ ఇద్దరి హీరోల సినిమాల మధ్య గట్టి పోటీ ఉండేలా కనిపిస్తుంది. రెండు సినిమాలు హిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: