ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెర పై కూడా తన ఆకట్టుకునే నటనా టాలెంట్ తో దూసుకుపోతోంది అనసూయ భరద్వాజ్. నిజానికి తొలుత కొన్ని షోలకు యాంకర్ గా వ్యవహరించిన అనసూయకు, ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు మరియు గుర్తింపు లభించింది. ఇక ఆ షో సూపర్ సక్సెస్ తరువాత అనసూయకు పలు టివి ఆఫర్స్ తో పాటు కొన్ని సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. ఇక ఇప్పటివరకు ఆమె కొన్ని సినిమాల్లో అక్కడక్కడా మంచి పాత్రల్లో నటించింది అనే చెప్పాలి. ఇక ఆమె ఇప్పటివరకు నటించిన సినిమాల్లో క్షణం మూవీలోని నెగటివ్ రోల్ తో పాటు, రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర ఆమెకు ఎంతో మంచి పేరుని తెచ్చిపెట్టడం జరిగింది. 

 

ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, అనసూయకు రంగస్థలం మాదిరిగా మరొక సినిమాలో పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న మంచి పాత్ర దక్కినట్లు సమాచారం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, అతి త్వరలో తెరకెక్కించబోయే రంగమార్తాండ అనే వైవిధ్యమైన సినిమాలో అనసూయకు ఒక అద్భుతమైన పాత్రను ఆఫర్ చేయడం జరిగిందట. ఆ పాత్ర, సినిమాలో ఎంతో కీలకమని, అలానే ఆ పాత్ర ద్వారా అనసూయకు మరింత మంచి పేరు లభిస్తుందని కృష్ణవంశీ ఆమెకు తెలిపారట. అయితే ఆ పాత్రను గురించి విన్న అనసూయ, ఏమాత్రం క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట. 

 

ఇటీవల మరాఠీలో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన ‘నటసామ్రాట్’ కు అధికారిక రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్నారు. మధు కలిపు, అభిషేక్ జవ్కర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్న దర్శకుడు కృష్ణవంశీ, ఎలాగైనా ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి మళ్ళి లైం లైట్ లోకి రావాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత ఆయనకు ఎంత మేర మంచి పేరు తీసుకువస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: