జోష్... తర్వాత 'ఏం మాయ చేసావే' సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నాగచైతన్య.... ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టిన సాయి పల్లవి కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నారు. నాగచైతన్య ఎలాంటి లవ్ స్టోరీ ఉన్న సినిమా తీసిన దానికి బాగా పాపులారిటీ వస్తుంది. ఇప్పుడు నాగచైతన్యతో సాయిపల్లవి జతకట్టి... ఆ రాబోయే సినిమా పై అంచనాలు భారీగా పెంచేసి ఆసక్తిని రేపుతోంది. 23వ తారీఖు చైతన్య బర్తడే సెలబ్రేషన్ ఘనంగా జరిగాయి.

అయితే.. తన సహ నటుడు అయిన నాగచైతన్యకు 'మనసులో ఏం లేకుండా.. అందమైన మనసుతో.. కల్మషం లేకుండా నవ్వే మనిషి.. ఎంతో అద్భుతమైన హృదయం కలిగిన మనిషి చై గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ చాలా పెద్ద మెసేజ్ పెట్టింది సాయి పల్లవి.

అంతటి మహా నటి సాయి పల్లవి ట్వీట్ చేసి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో.. చైతూ సూపర్ హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. ఒకరోజు గడిచిన తర్వాత... ఇక తన మనసులోని మాటను బయటపెట్టేసాడు చైతూ. 'నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదములు. కానీ 'గారు' అని మాత్రం నన్ను సంబోదించకండి ప్లీజ్.' అంటూ బ్రతిమాలాడు. తాను ఇంకా కుర్రాడినే అని భావించిన చైతూ
.. గారు అని సంబోదించి తన వయసు పెంచొద్దని చెప్పేసాడు. దాంతో ఫిదా బ్యూటీ సాయి పల్లవి కూడా సరే అనేసింది. వీరిద్దరి మధ్య జరిగిన చాటింగు.. ఇప్పుడే ఇంటర్నెట్ లో రసవత్తరంగా మారింది. కాగా,  రియల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన వెంకటేశ్‌, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో కూడా అవే పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

 

 

   

మరింత సమాచారం తెలుసుకోండి: