టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ - సునీల్ లా స్నేహం గురించి అందరికి తెలిసిందే. సునీల్ హీరో గా, త్రివిక్రమ్ దర్శకుడు గా బిజీ గా ఉన్న రోజుల్లో కూడా ఎప్పుడన్నా ఖాళి దొరికితే త్రివిక్రమ్ ని కలుస్తా అని సునీల్, సునీల్ తోనే నా టైమ్ అంతా అని పలు సందర్భాల్లో ఇద్దరు అన్న మాటలు. అయితే కెరీర్ బిగినింగ్ లో త్రివిక్రమ్ మాటల రచయితగా కొనసాగారు..అదే సమయంలో సునీల్ టాప్ కమెడియన్లలో ఒకరిగా ఉంటూ వచ్చారు.  కెరీర్ బిగినింగ్ లో ఇద్దరు ఒకే గదిలో ఉంటూ, ఒకే కంచంలో తింటూ కలిసే సినిమా ఇండస్ట్రిలో ప్రయత్నాలు చేసారు. త్రివిక్రమ్ కి బ్రేక్ రాగానే సునీల్ కి కూడా కమెడియన్ గా అవకాశం ఇచ్చి, సునీల్ స్టార్ కమెడియన్ గా ఎదగటానికి అవసరం అయ్యే కారక్టర్లు రాసారు.

 

  అయితే ఇద్దరికీ అదృష్టం కలిసి వచ్చింది..త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారాడు. ఇక సునీల్ ‘అందాలరాముడు’ సినిమాతో హీరోగా మారాడు.  తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’ సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. చిన్నచిన్న సినిమాలు చేసుకుంటూ స్లోగా వస్తున్నాడు సునీల్ వచ్చాడు.  కాకపొతే ఈ మధ్యలో సునీల్ టైమ్ బాలేదు. త్రివిక్రమ్ మాత్రం మాటల మాంత్రికుడి హోదాలో పెద్దపెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ఉన్నాడు.


 త్రివిక్రమ్ గురించి సునీల్ కంటే బాగా తెల్సిన వాళ్ళు ఎవరు లేరు.  సునీల్ కి ఒకదశలో హీరోగా పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. అరవింద సమేత - అమర్ అక్బర్ ఆంటోని అలాగే చిత్ర లహరి - పడిపడి లేచే మనసు - చాణక్య వంటి సినిమాలు చేశాడు.  అటు హీరోగా నటించలేక..ఇటు కమెడియన్ గా కొనసాగలేక చాలా ఇబ్బందులు పడ్డ సమయంలో తన స్నేహితుడి కోసం రంగంలోకి దిగారు మాటల మాంత్రికుడు. 

 

 ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ మూవీతో సునీల్ స్థాయికి తగ్గ పాత్ర ఇచ్చి మరోసారి తన స్నేహబంధాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన స్నేహ సంబంధాన్ని చాటుకుంటున్నాడు.  ఇప్పుడు 'అల వైకుంఠపురములో ' సినిమాపై కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్ర సినిమాలో చాలా కీలకమైన పాత్రలో సునీల్ కనిపించబోతున్నారట. మరి ఈ మూవీతో అయినా సునీల్ జాతకం మారుతుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: