తెలుగు చిత్ర రంగంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసి నూతన ఒరవడి తీసుకు వచ్చారు చోటా.కె నాయుడు.  హీరోయిన్ అందాలు చూపించాలన్నా..ప్రకృతి సోయగాలు చూపించాలన్నా.. హీరో ని స్టైలిష్ గా చూపించాలన్నా..   అందమైన పాటల చిత్రీకరణ ఒక్కటేమిటి..చోటా కే నాయుడు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఆయన సోదరుడు  శ్యామ్ కె. నాయుడు కూడా తెలుగులో ప్రముఖ ఛాయాగ్రాహకులే. తెలుగులోనే కాక తమిళ్, హిందీ భాషల్లోనూ ఛోటా కె. నాయుడు పనిచేసారు. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలందరికీ ఛోటా కె నాయుడు కెమెరామెన్ గా పనిచేశారు. 


 
ఇటీవల కొన్ని కాంట్రవర్సీలో ఈ కెమెరామాన్ చిక్కులు కొని తెచ్చుకున్న విషయం తెలిసిందే.  హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కవచం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కాజల్ అగర్వాల్ ముగ్గపై ముద్దు పెట్టాడు.  అప్పుడు ఆ విషయం పెద్దగా ఫోకస్ కాకున్నా తర్వాత సోషల్ మీడియాలో టామ్ టామ్ అయ్యింది. తాజాగా చోటా కే నాయుడు  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కెమెరామెన్ గా ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశా..అయితే దర్శకత్వం కూడా చేయాలని ఉన్నప్పటికీ అది ఎంతో బరువు బాధ్యతలతో కూడుకున్నది కావడంతో ఆలోచిస్తున్నానని అన్నారు.  

 

ఈ సందర్భంగా తెలుగు హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువైపోయింది. వాళ్లు ఆదేశించినట్టుగానే అన్నీ నడుస్తున్నాయి.  గత కొంత కాలంగా ఇతర రాష్ట్రాల నుంచి టెక్నికల్ టీమ్ వస్తున్నారని.. పస లేని కెమెరామాన్స్ రావడం  తక్కువ ఖర్చుతో సినిమాను పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు.  దాని వల్ల తెలుగులో ఉన్న చాలా మంది కెమెరామాన్స్ కి పనిలేకుండా పోతుందని అన్నారు.  

 

ఒక రకంగా చెప్పాలంటే తెలుగు కెమెరామెన్లకి ఇప్పుడు పెద్దగా పనిలేదు. కొత్తగా వచ్చిన కొంత మంది కెమెరామెన్లు చేస్తున్న లైటింగ్ సరిగ్గా ఉండటం లేదు.. అయినా వాళ్లతోనే చేయిస్తున్నారు.  నేను ఏ మూవీకి పనిచేసినా చాలా బాధ్యతాయుతంగా ఉంటాను. అందుకే నేను వర్క్ చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: