ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఇస్మార్ట్ శంకర్  అతని కెరీర్ మరిచిపోలేని విజయం. మొదటి సారి మాస్ మసాలా సినిమాతో వచ్చి మంచి విజయం అందుకున్నాడు. ఆ సినిమాలో రామ్ నటన, పలికే మాటలు, డాన్సులు అన్నీ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి. హైదరాబాదీ యాసలో అదరగొట్టి అందరినీ ఆకర్షించాడు. అయితే ఇదంతా పూరి జగన్నాథ్ వల్లే సాధ్యమైందని కొందరి వాదన.

 

ఎవరి వాదన ఎలా ఉన్నా...మాస్ మసాలా సినిమాకి రామ్ సరిపోతాడని తీసుకోవడంలోనే పురి జగన్నాథ్ గెలిచినట్టు. రామ్ కూడా పూరి ఏదైతే ఆశించాడో దాన్ని వందశాతం ఇచ్చాడు. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ పూరి తన తర్వాతి చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేయడంతో డబల్ ఇస్మార్ట్ ఇప్పట్లో ఉండదని తెలుస్తుంది. 

 

అయితే రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. కిషోర్ తిరుమలతో రామ్ కిది మూడవ సినిమా. కిషోర్ తిరుమలతొ చేసిన నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి  చిత్రాలు ఓ మోస్తారు విజయాన్ని సాధించాయి. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో షూటింగ్ జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఒక షెడ్యూలుని గోవాలో ప్లాన్ చేశారట. 

 

'ఇస్మార్ట్ శంకర్' సినిమాను కొన్ని కీలకమైన సీన్లను గోవాలో చిత్రీకరించారని.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి ఇప్పుడు సెంటిమెంట్ గా 'రెడ్' సినిమాకు గోవా షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.పూరి జగన్నాధ్ వల్లే ఈ గోవా సెంటిమెంట్ రామ్ కు వచ్చిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి గోవా సెంటిమెంట్ రామ్ కు మరోసారి వర్క్ అవుట్ అవుతుందా అనేది వేచి చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: