హృదయ కాలేయం సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నటుడిగా అడుగుపెట్టిన సంపూర్ణేష్ బాబు, పక్కా స్పూఫ్ గా మంచి హాస్యభరితంగా తెరకెక్కిన ఆ సినిమాతో హిట్ ని అందుకున్నాడు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సైతం ఆ సినిమాపై పొగడ్తలు కురిపించడం విశేషం. నిజానికి అంతకముందు కృష్ణ వంశి తెరకెక్కించిన మహాత్మా అనే సినిమాలో నటించిన సంపూ, హృదయ కాలేయం సినిమాతో కామెడీ హీరోగా మారారు. ఆ తరువాత పెసరట్టు, సింగం 123, తో పాటు ఇటీవల కొబ్బరి మట్ట సినిమాల్లో హీరోగా నటించిన సంపూ, 

 

మధ్యలో కొన్ని ఇతర సినిమాల్లో కూడా నటించడం జరిగింది. ఇకపోతే నేడు ఆయన ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే, కాసేపటి క్రితం తన ఊరైన సిద్ధిపేట నుండి హైదరాబాద్ కు కారులో తన భార్య మరియు కూతురితో కలిసి బయలుదేరారు. అయితే సంపూ కారుకు సడన్ గా సిద్ధిపేట కొత్త బస్సు స్టాండ్ వద్దకు చేరుకుంటున్న సమయంలో ఒక ఆర్టీసీ బస్సు ఢీకొట్టడం జరిగింది. ఇక ఆ ప్రమాద సమయంలో కారులో ఉన్న సంపూతో పాటు ఆయన భార్య మరియు కూతురికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. 

 

కాగా ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడి స్థానికులు సంపూ ఫ్యామిలీని దగ్గరి లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకొని ప్రమాద పరిస్థితిపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే ప్రమాద సమయంలో సంపూ సహా ఆయన కుటుంబ సబ్యులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా వారికి సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంతో టాలీవుడ్ లోని నటులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాద ఘ్తన విషయమై సంపూకు కాల్ చేసి వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం....!!

మరింత సమాచారం తెలుసుకోండి: