తెలుగు బుల్లితెరపై తన మాటల చాతుర్యంతో అందరి మనసు దోచిన యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు. సుమ ప్రజాదరణ పొందిన తెలుగు టెలివిజన్ యాంకర్ లల్లో ఒకరని చెప్పాలి. రెండు దశాబ్ధాలుగా ఈమె బుల్లితెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న `క్యాష్` మంచి ఆదరణ పొంతుంది. అయితే క్యాష్ లేటెస్ట్ ఎపిసోడ్లో హాస్యనటుడు అలీ, నటుడు పోసాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీని సుమ కొన్ని రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగింది. మొదట ఈ ఇద్దరిలో మీకెవరు ఇష్టం? అని రెండు ఆప్షన్స్ ఇచ్చింది.
అందులో ఒకటి రాఘవేంద్రరావు పేరు కాగా.. మరొకటి పవన్ కల్యాణ్ పేరు. అయితే చాలా మంది అలీ పవన్ కల్యాణ్ పేరు చెబుతాడని భావించారు. కానీ వీరందరికీ షాక్ ఇస్తూ..ఆయన మాత్రం రాఘవేంద్రరావు అంటే ఇష్టమని చెప్పారు. వాస్తవానికి పవన్ కల్యాణ్కు అత్యంత సన్నిహితుల్లో అలీ ఒకరన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాల్లో ఆయన పక్కన ఎవరున్నా.. లేకున్నా, కచ్చితంగా ఉండే వ్యక్తి మాత్రం కమేడియన్ అలీ. పవన్ బ్లాక్ బస్టర్ సినిమాలు అన్నింటిలో అలీ కీలక పాత్రలు పోషించారు.
సినిమాల్లో తన పక్కన అలీ ఉంటే.. అదో రకమైన ఉత్సాహం ఉంటుందని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. అయితే పవన్ ‘జనసేన’ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేయగానే.. అలీ ఆ పార్టీలో చేరిపోతారని అందరూ భావించారు. కానీ, అలీ సార్వత్రిక ఎన్నికల సమయంలో అలీ వైసీపీలో చేరడంతో వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అలీపై అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటి నుంచి అదే గ్యాప్ కొనసాగుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలోనే అలీ పవన్ కల్యాణ్ పేరును పట్టించుకోకుండా రాఘవేంద్రరావు పేరు చెప్పాడనుకోవచ్చు. ఇక ఇదే రాపిడ్ ఫైర్లో భాగంగా పూరి జగన్నాథ్, రవితేజల్లో ఎవరంటే ఇష్టమని సుమ ప్రశ్నించగా.. రవితేజ అని చెప్పాడు అలీ. ఇక చివరలో చిరంజీవి గురించి అడిగిన ఓ ప్రశ్నను మాత్రం పూర్తిగా రివీల్ చేయకుండా సస్పెన్స్లో పెట్టేశారు. అదేంటో తెలియాలంటే శనివారం ప్రసారమయ్మే క్యాష్ ప్రోగ్రామ్ చూడాల్సిందే.