ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ప్రోగ్రాం ప్రతివారం సెలబ్రెటీలు వచ్చి సందడి చేస్తూ ఉంటారు ఇక సుమ తన టైమింగ్ తో  అందరి పై కామెంట్ చేస్తూ కామెడీ  పంపుతూ ఉంటుంది. అంతే కాదు సుమ ప్రోగ్రాం లో తన వాక్చాతుర్యంతో అదరగొడుతుంది కూడా. అయితే ఈ వారం సుమా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్  ఎపిసోడ్ నటుడు పోసాని కమెడియన్ అలీ  పాల్గొన్నారు. ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో తాజాగా  విడుదల చేయగా ఇందులో ఎప్పటిలాగే సందడి సందడిగా ఫన్నీ ఫన్నీ పంచ్ లతో  ఫుల్ జోష్ గా  ఉంది .అయితే ఈ ప్రోమోలో  భాగంగా కమెడియన్  అలీ ని  సుమ  కొన్ని రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడుగుతోంది. ఇందులో ఆలీ ఆసక్తికర సమాధానం చెప్పారు.

 

 

 ఈ ఇద్దరిలో  మీకు ఎక్కువగా ఎవరు ఇష్టం అని  సుమ ప్రశ్న అడిగి  దానికి రెండు ఆప్షన్లు స్తుంది . సుమ ఇచ్చిన అప్షన్ లలో  మొదటిది కె.రాఘవేంద్రరావు రెండవది పవన్  కళ్యాణ్ . అయితే అలీ పవన్ కళ్యాణ్ పేరు చెబుతాడు  అని అందరూ అనుకున్నారు కానీ అలీ మాత్రం తనకు  రాఘవేంద్ర రావు గారు అంటే ఎక్కువ ఇష్టం  అని చెప్పేసాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఇక అంతే కాకుండా పూరి జగన్నాథ్ రవితేజ  లలో ఎవరంటే ఇష్టం అంటూ ప్రశ్నించింది సుమ .దీనికి ఆన్సర్ ఇస్తూ  రవితేజ ఇష్టం అంటూ అని సమాధానం చెప్పాడు. చివర్లో చిరంజీవి గురించి ఓ ప్రశ్న అడుగుతూ  సస్పెన్స్ లో పెట్టేసింది యాంకర్ సుమ. 

 


 అయితే ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి కూడా కొన్ని ప్రశ్నలు అడిగింది కానీ పోసాని మాత్రం అడిగిన ప్రశ్నలకు కోపంగా రియాక్టర్ అయి షో లో గొడవ చేసినట్లు ప్రోమో విడుదల చేసింది క్యాష్ యాజమాన్యం. మొత్తానికి అయితే అలీ పోసాని లతో క్యాష్ నెక్స్ట్ ఎపిసోడ్  లో ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఉండబోతుంది  అని అర్థమైంది. ఈ ప్రోమోలో  చూపించిన సస్పెన్స్ ఏమిటో తెలుసుకోవాలంటే క్యాష్ ఎపిసోడ్ చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: