ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై సెటైరికల్గా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ సినిమా శుక్రవారం అంటే 29-11-2019 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, కేఏ పాల్, పవన్ కళ్యాణ్లను పోలిన పాత్రలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇక టీజర్, ట్రైలర్, సాంగ్స్తో సినిమాకు ఇప్పటికే కావాల్సినంత క్రేజ్ని తెచ్చి పెట్టాడు వర్మ.
అదీ గాక రిలీజ్కు డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా విశేషాలు తెలియజేసేందుకు మీడియా సమావేశం కూడా నిర్వహించాడు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఉన్న తన ఆఫీస్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేమంటే ఏ వర్గాన్ని తక్కువగా చేసి ఈ సినిమాలో చూపించటం లేదని, కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేసుకున్నానని, ఈ చిత్రం ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా నిలిచిపోతుందని వెల్లడించారు.. కాని కొందరు పని గట్తుకుని తనపై దుష్ప్రచారానికి దిగుతున్నారు. వారు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే తాను ఎవరినీ టార్గెట్ చేసి ఏ సినిమా చేయనని కేవలం తనకు ఇంట్రస్టింగ్గా అనిపించిన పాయింట్ను మాత్రమే సినిమాగా తెరకెక్కిస్తానని తెలిపాడు.
ఇకపోతే సమాజంలో మామూలు క్రైమ్ కన్నా.. పొలిటికల్ క్రైమ్ మరింత ఇంట్రస్టింగ్గా ఉంటుందని అందుకే ఈ మధ్య ఆ తరహా సినిమాలు ఎక్కువగా తెరకెక్కిస్తున్నానన్నాడు. ఇదీ గాక కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఓ కామెడీ ఎంటర్టైనర్ అని షాక్ ఇచ్చాడు.. ఇక తనకు చిన్నప్పటి నుంచి గిల్లటం అంటే ఇష్టం అంటూ ఇలాంటి వివాదాస్పద చిత్రాలను ఎందుకు రూపొందిస్తున్నాడో క్లారిటీ ఇచ్చాడు.
నాకు ఎవరైనా పొగిడితే నిద్రొచ్చేస్తుంది. బాగా తిట్టించుకోవటం నాకు ఇష్టం అందుకే ఇలాంటి సినిమాలు చేస్తున్నా అని తెలిపారు. ఇక సిద్ధార్థ్ తాతోలుతో కలిసి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో భారీ స్టార్ కాస్ట్ ఏది లేకపోయినా ఇప్పటికే వర్మ తనదైన ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకువచ్చాడు.