మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముందు నుంచి ఎక్స్‌పరిమెంట్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. బహుషా మెగా ఫ్యామిలిలో అలా చేస్తున్న మొదటి యంగ్ హీరో వరుణ్ కావడం విశేషం. సక్సస్ కోసం కమర్షియల్ సినిమాలంటు ఆరు పాటలు, నాలుగు ఫైట్లు ఉన్న కథలను ఎంచుకోకుండా కొత్త కథల వైపు మొగ్గు చూపుతున్నాడు. ఈ విషయంలో వరుణ్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇక రీసెంట్‌గా గద్దలకొండ గణేష్ అంటూ వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో  బాక్సింగ్ బ్యాగ్డ్రాప్ లో సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ సినిమాను అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ నిర్మించబోతున్నాడు. పూర్తి స్థాయి నిర్మాతగా బాబీకి ఇదే మొదటి సినిమా అవ్వడం వల్ల అందరు కూడా ఈ సినిమా మీద ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయంలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతునే ఉన్నాయి.

 

వాస్తవంగా ముందు ఈ సినిమా కోసం కైరా అద్వానీని సంప్రదించారు. ఆమె ఓకే చెప్పింది కూడా. కాని బాలీవుడ్  సినిమాలకు ముందే డేట్లు ఇచ్చిన కారణంగా కొంత సమయం కావాలని చెప్పిందట. అందుకే నిర్మాతలు ఓకే అన్నప్పటికి హీరో వరుణ్ తేజ్ మాత్రం ఆమె కోసం వెయిట్ చేయడం ఎందుకంటూ నిర్మాతల సూచించినట్లు  మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు మెగా మూవీ కి వెంటనే డేట్లు అడిగిన కారణంగా కైరా అద్వానీ నే ఈ ఆఫర్ కి నో చెప్పిందని తాజా సమాచారం.

 

కైరా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో 4-5 సినిమాల్లో నటిస్తోంది. వాటిలో రెండు సినిమాలు అక్షయ్ కుమార్ వి కావడం ఆసక్తికరం. అక్కడ బిజీగా ఉన్నా కూడా సౌత్ లో నటించేందుకు ఆమె ఆసక్తి చూపుతోంది. కాని డేట్లు కుదరక పోవడం వల్ల వరుణ్ తేజ్ కు జోడీగా నటించే అవకాశంను తిరస్కరించింది. ప్రస్తుతం వరుణ్ కు జోడీ కోసం దర్శకుడు కిరణ్ కొర్రపాటి కొత్త జోడీని వెదికే పనిలో ఉన్నాడు. త్వరలోనే హీరోయిన్ ను ఫైనల్ చేసి సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. వచ్చే ఏడాది దసరాకు విడుదల చేయాలని పక్కగా ప్లాన్ చేస్తున్నారని లేటెస్ట్ న్యూస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: