సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... ఏం చేసినా సంచలనమే అవుతుంది. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు రాంగోపాల్ వర్మ. ఇక రామ్ గోపాల్ వర్మ చేసిన ట్విట్  సంచలనమే...  రాంగోపాల్ వర్మ మాట సంచలనమే... రామ్ గోపాల్ వర్మ ఏ చిన్న పని చేసినా అది పెద్ద సంచలనంగా  మారిపోతుంది. అందుకే రాంగోపాల్ వర్మ ను ప్రేక్షకులందరూ సంచలనాలు దర్శకుడిగా పిలుచుకుంటారు. ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కనిపిస్తూ ఉంటాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. అసలు వివాదం లేకుండా ఏ సినిమాను తెరకెక్కించడు రాంగోపాల్ వర్మ. వర్మ సినిమాలన్ని  కేరాఫ్ వివాదాలే. గతంలో లక్ష్మి ఎన్టీఆర్ పేరుతో పెను సంచలనం సృష్టించాడు రామ్ గోపాల్ వర్మ

 

 

 

 ఈ సినిమాతో ఎంతగా సంచలనం సృష్టించాడు అంటే ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన టిడిపి అధినేత చంద్రబాబే దిగివచ్చి సినిమా విడుదల వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ వేసేంతల . అప్పట్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కూడా బాగానే సంచలనం సృష్టించింది.ఈ  సినిమాలో  చంద్రబాబు ఎన్టీఆర్ ని ఎలా వెన్నుపోటు పొడిచి టిడిపి పార్టీ నూతన కైవసం చేసుకున్నాడో అనే  విషయంలో అసలు నిజాలు బయట పెడతానని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో సంచలనానికి తెరలేపారు రాంగోపాల్ వర్మ. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాని తెరకెక్కిస్తున్న మరో  సంచలనం సృష్టించబోతున్నాడు రామ్ గోపాల్  వర్మ. ఈ సినిమాలో 2019 ఎన్నికల్లో ఆంధ్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూపించబోతున్నాను  ఇప్పటికే ట్రైలర్ లో క్లారిటీ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. 

 

 

 

 అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాంగోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకి  వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ వెనక్కి తగ్గి సినిమా టైటిల్ మార్చేందుకు  నిర్ణయించాడు.  ఈ సినిమా టైటిల్ పై వివాదాలు చెలరేగడంతో వర్మ  సినిమా టైటిల్ మారుస్తూన్నట్టు సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ గా ఈ సినిమా టైటిల్  మారుస్తుతున్నట్లు వర్మ ప్రకటించారు. కాగా ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం అనుమానంగానే మారింది . అయితే ఇప్పటికే  విడుదల చేసిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ పాత్రలో ఈ సినిమాలో ఎక్కువగా టీడీపీ అధినేత చంద్రబాబు,  టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: