నాగార్జున సినీ జీవితం చాలా దారుణంగా ఉంది. ఇటీవల వచ్చిన మన్మధుడు 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టింది. టాలీవుడ్ కింగ్ గా పేరొందిన నాగార్జున.. తన చిత్రాలు ప్లాపులు అవ్వడంతో చాలా నిరాశలో ఉన్నాడని సినీ వర్గాలు నుంచి సమాచారం. అందుకే త్వరగా ఒక మంచి సినిమాని తీసి ఎలాగైనా తన ఖాతాలో ఒక హిట్ ని వేసుకొని మళ్లి ఫామ్ లోకి వద్దామని ప్రయతిస్తున్నాడు. అందుకే సోగ్గాడే చిన్నినాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తీయబోయే 'బంగార్రాజు' కథను విన్నా కూడా ఆ సినిమాలో నటించడానికి నాగ్ సిద్ధంగా లేడంట. బంగార్రాజు ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ అవ్వడంతో... రొటీన్ గా మళ్లి రొమాంటిక్ క్యారెక్టర్ చేస్తే ఎక్కడ ఫెయిల్ అవ్వుతుందేమోనని భయం పట్టుకుందంట.


అయితే కొన్ని రోజుల క్రితం కొత్త దర్శకుడైన సోలోమెన్ చెప్పిన కథను విన్నారట నాగార్జున. సోలోమెన్ వినిపించిన కథ బాగా నచ్చేయడంతో.. నాగార్జున అతను కొత్త దర్శకుడైనప్పటికీ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. అయితే ఇంతకుముందు నాగార్జున కొత్త దర్శకులతో తీసిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. దాంతో...తన నెక్స్ట్ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నాగ్ విశ్వసిస్తున్నాడు. అయితే నాగ్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా అవతారమెత్తనున్నాడు. కానీ ఈ సినిమాలో కేవలం గంట సేపు మాత్రమే కనిపిస్తారట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సోలోమెన్ దర్శకత్వం వహించే ఈ చిత్రం భారీ తారాగణంతో తెరకెక్కుతుందంట. సోలోమెన్ మహర్షి, ఊపిరి సినిమాలకు స్క్రీన్ ప్లే రైట‌ర్ గా పనిచేసాడు.

ఇక నాగార్జున తన సినిమాలలో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ కోసం నాగచైతన్య సరసన నటించిన హీరోయిన్స్ మీదనే కన్నేస్తున్నాడు. చైతూ తో రారండోయ్ వేడుకచూద్దాం చిత్రంలో నటించిన రకుల్ ప్రీత్ ని తన మన్మధుడు 2 సినిమాకు ఎంచుకున్నాడు నాగ్. ఇప్పుడేమో.. చైతూ సరసన దడ సినిమాలో నటించిన కాజల్ అగ్గార్వాల్ పై కన్నేశాడంట నాగార్జున. సో, ఈ చిత్రంలో కాజల్ నటిస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: