పదమూడు సంవత్సరాల తర్వాత తిరిగి తెరమీద కనిపించబోతున్నారు లేడీ అమితాబ్ విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా నటించబోయే ఈ చిత్రంలో విజయశాంతి ఓ కీలక పాత్రను పోషించడానికి అంగీకరించారు. దీని వెనక ఓ చిన్న కథ ఉంది. అదేమిటంటే విజయశాంత ముందు తెలుగు తెరకు పరిచయమైంది. కృష్ణగారి సినిమా కిలాడికృష్ణుడుతో దానికి విజయనిర్మల దర్శకత్వం వహించింది. అయితే ఎంట్రీ కృష్ణ సినిమాతో అయితే రీఎంట్రీ మహేష్బాబు సినిమాతో వచ్చింది. ఇది అసలైన ఆశక్తిదాయకమైన విషయం. విజయశాంతి కిలాడికృష్ణుడులో ఎలా పరిచయం అయిందంటే ఆమె చెన్నైలో పొలిఏంజల్స్ స్కూల్లో చదువుకునేది. పదవతరగతి వరకే చదివిన తర్వాత ఆమె పద్నాలుగు ఏళ్ళు ఉండగానే ఆమెకు సినిమాల పై ఇంట్రెస్ట్ వచ్చింది. ఆమె పిన్ని అయిన విజయలలిత ప్రముఖ నటి. ఆమె సారధ్యంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండగా మొదట తమిళంలో ఆమెకు భరత్రాజాగారి దర్శకత్వంలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత విజయనిర్మల ఆమెని తెలుగులో పరిచయం చేశారు. అయితే విజయశాంతి మొట్టమొదటిసారిగా మహేష్బాబుతో నటిస్తున్నట్లు చాలా మంది అనుకుంటారు కానీ ఆయన బాలనటుడుగా ఉన్నప్పుడే కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో విజయశాంతి నటించింది.
అయితే ఆ చిత్రంలో ఓ సీన్ని ఇప్పటికీ విజయశాంతి ఎప్పుడన్నా ఏదన్నా సందర్భంలో గుర్తుచేసుకుని నవ్వుకుంటుంది. అదేమిటంటే విజయశాంతి ఒక సీన్లో మహేష్బాబుని చంపమీద కొట్టాలి. డైరెక్టర్ కొట్టమని చెపుతారు. అయితే అక్కడ తండ్రి స్థానంలో ఉన్నది కూడా ఎవరో కాదు కృష్ణ. అందులోనూ ఎంతో ముద్దుగా ఉన్న మహేష్ని కొట్టడానికి ఆమెకి చేతులు రావడంలేదు. దాంతో కృష్ణగారు ఆ సీన్ని అలా చేస్తేనే పండుద్ది అని ఎన్ని సార్లు చెప్పినా కొట్టడం లేదు. మహేష్ కొట్టండి మేడమ్ పర్వాలేదు అన్నాక గట్టిగా కొట్టినట్లు నటించి మొత్తానికి షాట్ ఓకే అనిపించుకుంది.
మొదట్లో విజయశాంతిని గ్లామర్గానే చూపించేవారు దర్శకనిర్మాతలు. అయితే ఆ పాత్రల్లో నటించేది కానీ ఎక్కడో తెలియని అసంతృప్తి మాత్రం అలానే ఉండేది. దాంతో మొట్టమొదటిసారిగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసింది విజయశాంతి. కర్తవ్యంతో మంచి పేరును సంపాదించుకుంది.