బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా తర్వాత ఓటమెరుగని దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక టాలీవుడ్ ప్రేక్షకుల్లోనే  కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు  ఎంతో మంది. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్... రామ్ చరణ్ లు నటిస్తుండటం కూడా ఈ సినిమా పై అంచనాలు పెంచుతోంది.కాగా  సినిమా గురించి చిన్న లీక్  బయటికి వచ్చినా కూడా అదే వైరల్ గా మారిపోతుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. 

 

 

 

 రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్  చిత్రంలో రామ్చరణ్ సరసన అందాల భామ ఆలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ సరసన తాజాగా  హాలీవుడ్ నటి ఓవిలియ మోరీస్   ను సెలెక్ట్ చేసింది చిత్ర బృందం . తాజాగా రామ్ చరణ్  సరసన నటిస్తున్న అలియా భట్  పై  ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ నుంచి అలియా భట్ ను  ఇంటికి పంపించేసిందట చిత్రబృందం. ఇప్పటికి  ఆర్ఆర్ఆర్  సినిమాకు సంబంధించిన 70 శాతం షూటింగ్ పూర్తయిందని ఈ సినిమాలో ఆలియా భట్ సన్నివేశాలన్నీ నిన్నటితో పూర్తికావడంతో ఏకంగా ముంబై ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది అని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

 

 

 

 అయితే ఇప్పటికే రామ్ చరణ్ అలియాభట్ మధ్య ఉన్న సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయిందని... కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ జోడీగా నటిస్తున్న హాలీవుడ్ భామ ఓవిలియ లపై  సన్నివేశాలు చిత్రీకరణ మిగిలి ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఓవిలియ  సన్నివేశాలే కాకుండా సినిమా క్లైమాక్స్ చిత్రికరణ కూడా మిగిలి ఉందని టాక్.ఆర్ఆర్ఆర్ చిత్రం క్లైమాక్స్ ను ఫిబ్రవరి లోపు  షూటింగ్ కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో... ముందుగా అనుకున్న విధంగానే 2020 జూలై 30న విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారట  దర్శక ధీరుడు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: