విక్టరీ వెంకటేష్ తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో వెంకీ కి జోడిగా పాయల్ రాజ్ పుత్, చైతూకి జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్.. 'అసురన్' రీమేక్ చేయడం ఫిక్స్ అయిపోయింది. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమాని సురేష్ బాబు తన బ్యానర్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సురేష్ బాబు స్పష్టంచేశారు. అయితే ఆయన అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినప్పటికి ఈ రీమేక్ ను శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేయబోతున్నాడనే విషయం ఇండస్ట్రీలో బాగా స్ప్రెడ్ అవడమే కాదు ఆయనే డైరెక్టర్ అని కూడా దాదాపు ఫిక్స్ అయింది. ఇప్పుడీ ప్రాజెక్టు కోసం కొత్త నటీనటుల్ని తీసుకోవాలని సురేష్ బాబు నిర్ణయించారు. ఈ మేరకు కాస్టింగ్ కాల్ వచ్చేసింది.

 

14 నుంచి 18.. 35 నుంచి 45... ఇలా వివిధ వయసుల మధ్య ఉన్న మేల్ ఆర్టిస్టుల కోసం ప్రకటన ఇచ్చింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ. పూర్తిగా మేల్ ఆర్టిస్టుల కోసం ఉద్దేశించిన ప్రకటన ఇది. ఇందులో 3 విలన్ పాత్రలు కూడా ఉన్నాయి. ఈ కాస్టింగ్ కాల్ బాధ్యతలన్నింటినీ శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించారట సురేష్ బాబు. ఇది పూర్తయిన తర్వాత మహిళల కోసం ప్రత్యేకంగా ఫిమేల్ కాస్టింగ్ కాల్ ఒకటి ఇవ్వబోతున్నారు. ఇందులో కూడా వివిధ వయసుల వాళ్లను తీసుకోబోతున్నారు. అయితే ఈ కాస్టింగ్ కాల్ లో హీరోయిన్ రోల్ మాత్రం ఉండదని కన్‌ఫార్మ్. ఎందుకంటే ఆ పాత్ర కోసం ఆల్రెడి శ్రియను అనుకుంటున్నారు చిత్ర బృదం. 

 

కాస్టింగ్ కాల్ పూర్తయిన తర్వాత సినిమాను అఫీషియల్ గా ప్రకటించాలని అనుకుంటున్నారట. ఈ గ్యాప్ లో వెంకీ మామ రిలీజ్ పనుల్ని పూర్తిచేస్తారు నిర్మాత సురేష్ బాబు. అయితే ఈ రీ మేక్ కి వెంకీ ఎంతవరకు సూటవుతాడో చూడాలి. ఎందుకంటే అసురన్ ఊర మాస్ గా ఉంటుంది. కానీ ఆ క్యారెక్టర్ లో వెంకీని ఊహించుకోవటం కాస్త కష్టమే. అంతేకాదు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా ఇలాంటి మాస్ బ్యాగ్డ్రాప్ లో సినిమాని తెరకెక్కించలేదు. ఇప్పటి వరకు ఆయన తీసినవన్ని క్లాస్ ఫ్యామీ సినిమాలే. అందుకే డైరెక్టర్ మీద కూడా కాస్త అనుమానాలున్నాయి. మరి ఈ సినిమా రీమేక్ ఎంతవరకు సక్సస్ అవుతుందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: