స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో సెట్స్ మీద ఉన్నాడు. 2020 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేసేలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె రొమాన్స్ చేస్తుంది. దిలాఉంటే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో మూవీ చేస్తాడని తెలిసిందే. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్ తో బన్ని క్రేజీ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందట.

 

ఈ సినిమాతో పాటుగా వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ మూవీ ఎనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. అయితే ఆ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా వి.ఐ ఆనంద్ చెప్పిన కథకు బన్ని సారీ చెప్పాడట. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మెప్పించిన ఆనంద్ అల్లు శిరీష్ తో ఒక్క క్షణం సినిమా చేశాడు. ఆ సినిమా హిట్టైతే బన్నితో సినిమా ఉండేది. కాని ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

 

అందుకే అల్లు అర్జున్ ఆనంద్ తో సినిమా రిస్క్ అనుకుని లైట్ తీసుకున్నాడు. అయితే బన్ని కోసం చేసిన అదే కథను నిఖిల్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే వి.ఐ ఆనంద్ డైరక్షన్ లో నిఖిల్ హీరోగా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. నిఖిల్ తో ఆల్రెడీ ఎక్కడికి పోతావు చిన్నవాడా హిట్ అందుకున్న వి.ఐ.ఆనంద్ మరో క్రేజీ హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

 

తప్పకుండా ఈ కాంబినేషన్ లో మూవీ ఆడియెన్స్ అంచనాలకు మించి ఉంటుందని చెప్పొచ్చు. నిఖిల్ కూడా ఎప్పుడు ప్రయోగాలకు రెడీ అంటాడు. మరి వి.ఐ.ఆనంద్ మూవీతో మరోసారి ఎలాంటి సర్ ప్రైజ్ చేస్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: